హుజారాబాద్ ఉపపోరు హోరాహోరీగా సాగినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ గెలుపు తథ్యమని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అలాగే స్వల్ప మెజార్టీతో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మరికొన్ని సర్వేలు వెల్లడించడం విశేషం. ఆత్మసాక్షి సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం... హుజురాబాద్లో భారతీయ జనతా పార్టీకి 50.5 శాతం ఓట్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 43.1 ఓట్లు వస్తాయి. కాంగ్రెస్కు 5.7శాతం ఓట్లు రావొచ్చు. ఇతరులు, నోటా కలిపి 0.7 శాతం ఓట్లు వస్తాయని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
మండలాల వారీగా ఎగ్జిట్ పోల్స్ను పరిశీలిస్తే.. ఇల్లంతకుంట మండలంలో టీఆర్ఎస్కు 50 శాతం, బీజేపీకి 42.5 శాతం ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 6.5 శాతం, ఇతరులకు ఒక శాతం ఓట్లు రావొచ్చు. కమలాపూర్ మండలంలో బీజేపీకి 62 శాతం, టీఆర్ఎస్కు 32 శాతం ఓట్లు రావొచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 5.5 శాతం ఓట్లకు మించి రాకపోవచ్చు. ఇతరులు, నోటా కలిపి 0.5 శాతం ఓట్లు వస్తాయి. జమ్మికుంట మండలంలో టీఆర్ఎస్ 47.5 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 45.5, కాంగ్రెస్ 6, ఇతరులు, నోటా కలిపి ఒక శాతం చొప్పున ఓట్లు సాధించే వీలుందని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ అంచనా.
ఇక వీణవంక మండలంలో బీజేపీ 55 శాతం, టీఆర్ఎస్ 39.5 శాతం, కాంగ్రెస్కు 5 శాతం, ఇతరులకు 0.5 శాతం ఓట్లు రావొచ్చు. హుజురాబాద్ మండలంలో బీజేపీకి 47.5 శాతం ఓట్లు రావొచ్చు. టీఆర్ఎస్కు 46.5 శాతం, కాంగ్రెస్కు 5.5 శాతం ఇతరులకు 0.5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నాగన్న సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్కు 45.3 నుంచి 48.9 శాతం ఓట్లు రావొచ్చు. బీజేపీకి 42.9 నుంచి 45.5 శాతం వరకు ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ కేవలం 2.25 నుంచి 4 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. ఇతరులకు 5.51 శాతం నుంచి 6.5 శాతం ఓట్లు వస్తాయి.