
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. బుద్ధి మాంద్యం, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, మానసిక ఎదుగదల లేని పిల్లలు, న్యూరాలజీకి సంబంధించి అవస్థ పడుతున్న పిల్లలు ఇలా ఎన్నో.. వీటన్నింటిపై సమకాలీన అధ్యయనం ఒకటి కావాలి. ఒక థెరఫీ సెంటర్ కావాలంటే ముందు వాటిపై అవగాహన ఉండాలి. డబ్బు ఒక్కటే కాదు అందుకు పరిష్కారం. నిపుణులు వారితో నిర్వహించే సెషన్స్..ఇవన్నీ ఆ సంస్థ ఎదుగుదలకు సమస్యపై పది మందికీ అవగాహన కల్పించేందుకు సాయపడతాయి. కోటిరెడ్డి దంపతులు రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య తో బాధపడుతున్న పిల్లలకు అండగా ఉంటున్నారు. ఆన్లైన్ క్లాసులు మరియు కోర్సులు ఉచితంగానే ఇస్తున్నారు. ప్రభుత్వాలు ముందుకు వస్తే రెండు నుంచి మూడు లక్షలు వెచ్చించి జిల్లాకో ఆటిజం థెరఫీ సెంటర్ తామే నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇంకా ఎన్నో మంచి పనులకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. చెప్పానుగా ఉన్నోళ్లంతా పంచాలన్న రూలేం లేదు. కానీ సామాజిక బాధ్యత ఒక్కటే కాదు చేయాలన్న దృక్పథం కూడా మంచి మార్పునకు సంకేతికే!