హైదరాబాద్ నగర పరిధిలో నష్టాల్లో ఉన్న డిపోలను మూసివేయాలని నిర్ణయించారు. సిబ్బందిని, బస్సులను ఇప్పటికే ఇతర డిపోలకు కేటాయించారు. అదే సమయంలో ఆయా డిపోల స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సంస్థకు అదనపు ఆదాయం వస్తుందని కూడా సజ్జనార్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో దూసుకెళ్తున్న సజ్జనార్.. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు మొగ్గు చూపుతున్నారు. తమ గ్రామానికి బస్ కావాలని ఎవరైనా సరే... ఓ ట్వీట్ చేస్తే చాలు... సంబంధిత అధికారులతో సర్వే నిర్వహించి... వెంటనే ఆ ప్రాంతానికి బస్సు ఏర్పాటు చేస్తున్నారు కూడా. తాజాగా మంచిర్యాల జిల్లా కోనంపేట గ్రామానికి దాదాపు 30 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. ఇదే విషయాన్ని గ్రామస్థులు సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. సరిగ్గా నాలుగు రోజుల్లోనే ఆ గ్రామానికి బస్ వచ్చేలా చేశారు సజ్జనార్. దీంతో 30 ఏళ్ల తమ కల నెరవేరిందంటూ... గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగర పరిధిలో నష్టాల్లో ఉన్న డిపోలను మూసివేయాలని నిర్ణయించారు. సిబ్బందిని, బస్సులను ఇప్పటికే ఇతర డిపోలకు కేటాయించారు. అదే సమయంలో ఆయా డిపోల స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సంస్థకు అదనపు ఆదాయం వస్తుందని కూడా సజ్జనార్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో దూసుకెళ్తున్న సజ్జనార్.. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు మొగ్గు చూపుతున్నారు. తమ గ్రామానికి బస్ కావాలని ఎవరైనా సరే... ఓ ట్వీట్ చేస్తే చాలు... సంబంధిత అధికారులతో సర్వే నిర్వహించి... వెంటనే ఆ ప్రాంతానికి బస్సు ఏర్పాటు చేస్తున్నారు కూడా. తాజాగా మంచిర్యాల జిల్లా కోనంపేట గ్రామానికి దాదాపు 30 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. ఇదే విషయాన్ని గ్రామస్థులు సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. సరిగ్గా నాలుగు రోజుల్లోనే ఆ గ్రామానికి బస్ వచ్చేలా చేశారు సజ్జనార్. దీంతో 30 ఏళ్ల తమ కల నెరవేరిందంటూ... గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.