గతంలో కొవిడ్ భారిన పడిన వారు ఇప్పుడు ఒమిక్రాన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ విషయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు పని చేస్తాయా అన్న అంశంపై అధ్యయనం కొనసాగుతోంది. కానీ, కొందరు పరిశోధకులు ఈ టీకాలు ఒమిక్రాన్పై పని చేస్తాయని, మరి ముఖ్యంగా వైరస్ తీవ్ర తరం కాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. కాబట్టి, వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలని, వేసుకున్న వారు బూస్టర్ డోసులు వేసుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక దక్షిణాఫ్రికా, యూరప్లో ఒమిక్రాన్ సోకిన వారిలో యువత ఎక్కువగా ఉందని ప్రాథమిక సమాచారం తెలుపుతోంది.
అలాగే, రాబోయే రోజుల్లో ఐరోపాలో భారీ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వారం రోజుల్లోనే 41 దేశాలకు పైగా ఒమిక్రాన్ వైరస్ విస్తరించిన నేపథ్యంలో ఆయా దేశాలు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందిని నిపుణులు సూచిస్తున్నారు. ఇక భారత దేశంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాబోయే నెలల్లో కొవిడ్-19 లాగా ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.