జీవితాన మ‌నం నేర్చుకున్న మంచి నేర్పాల‌న్న మంచి రెండూ స‌మానం అయి ఉంటే.. జ‌న జీవ‌న జాగృతి సాధ్యం..మేలిమి ఫ‌లితాలు సాధ్యం...ఇదే ఇవాళ్టి గ‌మ‌న సూత్రం...
ఆర్ట్సూ సైన్సూ
సైన్సు కెమిక‌ల్స్
ఇంకా.. ఆర్ట్సు యాక్ట్సు
ఇలా కొన్ని ప‌దాలు
జీవితాన్ని క‌దిపి కుదిపేస్తాయి
నిర్వీర్యం అయిన శ‌క్తుల‌ను వ‌దిలి
నిస్తేజం నుంచి చేత‌న వ‌ర‌కూ
చేసిన ప్రయాణంలో వివేకానందుడి స్మ‌ర‌ణ
ఈ దేశానికీ భార‌తీయ‌త‌కూ ఇవాళ ఎంతో అవ‌సరం


దేశంలో యువ‌త నిస్తేజంగా ఉన్నారు. దేశంలో యువ‌త‌కు అస్స‌లు బాధ్య‌త అన్న‌దే లేదు.. దేశంలో యువ‌తకు ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ అంటే గౌర‌వం లేదు.. ఇన్ని ప్ర‌క‌ట‌న‌లు లేదు లేదు లేదు అని వ‌స్తున్నాయి.వ‌స్తుంటాయి.. అవ‌న్నీ విని న‌వ్వి ఊరుకోవాలి.. నా దేశంలో అంతా కాక‌పోయినా కొంద‌రైనా బాధ్య‌త‌తో ఉన్నారు. మంచికి ప్ర‌తినిధులు అయి ఉన్నారు..మంచి అనే భావ జాల‌వ్యాప్తికి  సంసిద్ధులు అయి ఉన్నారు. అంతా అనే ప‌దం ప‌ద్ధ‌తిగా లేదు. మంచి కొంచెం అయినా ప్రేమించ‌డంలో ఉన్న ఆనందం ఒక‌టి అంతా ఆస్వాదించాలి అని ఓ క‌వి చెప్పారు. ఆ విధంగా జీవితాన మ‌నం నేర్చుకున్న మంచి నేర్పాల‌న్న మంచి రెండూ స‌మానం అయి ఉంటే.. జ‌న జీవ‌న జాగృతి సాధ్యం..మేలిమి ఫ‌లితాలు సాధ్యం.

ఇవాళ మా ఊళ్లో మా శ్రీ‌కాకుళం న‌గ‌రం,సూర్య‌మ‌హ‌ల్ జంక్ష‌న్ లో స్వామీ వివేకానంద విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు యువ ఎంపీ రామ్మోహ‌న్ అతిథిగా రానున్నారు.వైసీపీ నాయ‌కులు కూడా విచ్చేస్తారు.గౌర‌వ పార్ల‌మెంటేరియ‌న్ ఎప్ప‌టి నుంచో వివేకానందుని జీవితం గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు..ఆయ‌న జీవితం నుంచి నేర్చుకోద‌గ్గ సందేశం ఏంట‌న్న‌ది వివ‌రిస్తూనే ఉన్నారు.ఆ క్ర‌మంలో యువ ఎంపీ రామూ ఎప్ప‌టిక‌ప్పుడు కాలేజీల‌కు వెళ్లి  యువ‌త‌ను జాగృతం చేస్తున్నారు. చైత‌న్య శీల‌క స‌మాజం కార‌ణంగానే మంచి  ప‌నులు జ‌రుగుతాయి అని న‌మ్మే యువ నాయ‌కుల్లో ఎంపీ రామూ ఒక‌రు.


మరింత సమాచారం తెలుసుకోండి: