టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవిప్పుడు తెగ వైరల్ అయ్యాయి. కేటీఆర్ కు రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్దత మీకు తెలియకపోవడం బాధాకరమని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీ తండ్రి కేసీఆర్ ను అడగడం మంచిదని హితవు పలికారు. రైతు సమస్యల పరిష్కారానికి బదులు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ బాగా బిజీగా ఉండొచ్చని రేవంత్ సెటైర్ వేశారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల శ్రమను దోచుకుంటున్నారని రాహుల్ ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని.. మేము చేసి చూపిస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై తాజాగా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఇక రేవంత్ ట్వీట్ చేస్తూ 'కేటీఆర్.. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తోందని.. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతగా పాటుపడిందో పాపం మీకు తెలియదేమో..కాంగ్రెస్ చేసిందేంటోఅని కేసీఆర్ ను అడగండి చెబుతారు.



రైతుల సమస్యలను పరిస్కరించకుండా రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉన్నారని రేవంత్ విమర్శించారు.4 కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ యేనని.. తమ ప్రభుత్వంలో రైతులకు చాలా మేలు జరిగిందని గుర్తు చేశారు. ఉచిత కరెంట్ జలయజ్ఞం ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తెచ్చామని రేవంత్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 7వేల మంది రైతులను పొట్టన పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కై రాజకీయం చేస్తూ రైతులను పావుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.మరో ట్వీట్ లోనూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'మీరేమి బాధపడకండి కేటీఆర్. ఇక అన్ని విషయాల్లో కూడా మీ లాంటి ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆర్టీఈ ఆర్టీఐ వంటి వాటిని కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది' అంటూ రేవంత్  రెడ్డి రెడ్డి ఘాటు సెటైర్లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: