మొన్నటివరకు ప్రపంచ దేశాల్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్‌కు పుట్టినిలైన చైనాలో మరోసారి కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. కోవిడ్ నుంచి కోలుకుని పూర్తిగా బయటపడి రెండేళ్లు పూర్తి కాకుండానే మళ్లీ చైనాలో కరోనా పాజిటివ్ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి.కొన్ని దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి..చైనాలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ యొక్క కొత్త తరంగం కనిపించిందని, చాలా నగరాల్లో లాక్‌డౌన్ ప్రకటించబడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శుక్రవారం దాదాపు 10,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారిలో చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేవని చెబుతున్నారు.


పశ్చిమ చైనాలోని చాంగ్‌కింగ్, దక్షిణాదిలోని గ్వాంగ్‌జౌ నగరాల్లో లాక్‌డౌన్ కారణంగా దాదాపు 50 లక్షల మంది ప్రభావితమయ్యారు. బీజింగ్‌లో ప్రతిరోజూ 21 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.చాలా నగరాల్లోని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాస్‌లోకి వెళ్లిపోయాయి. ఆసుపత్రుల్లో సేవలపై ఆంక్షలు విధించారు. చాలా దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి. వారి సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రజలు వాగ్వాదానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


కొవిడ్‌కు కు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంతో ప్రజలు విసుగు చెందారు. లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి..జీరో టాలరెన్స్ విధానం వల్ల చైనాలో ఇన్‌ఫెక్షన్ రేటు తగ్గింది. కానీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలు, పరిశ్రమలు, దుకాణాలను ఒక్కసారిగా మూసివేయడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.కరోనా కేసులు మళ్లీ పెరగడంతో, చాలా ప్రాంతాల్లో వ్యాపారాలు మూసివేయబడుతున్నాయి. ఆంక్షలు విధిస్తున్నారు. కార్యాలయ భవనాలు, షాపింగ్ మాల్స్ మరియు బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి, ప్రజలు రోజుకు ఒకసారి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి..ఇక మిగిలిన దేశాలలో కూడా కరోనా మహమ్మారి మళ్లీ విజ్రుంభిస్తుంది.ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: