గత సంవత్సరం అమెరికా నగర వీధుల్లో కొంతమంది వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా నెట్టింట వైరల్ అయ్యాయి. నిలబడలేక, నడవలేక వింతగా ప్రవర్తిస్తున్న మనుషుల్ని చూసి కొంపతీసి జోంబీ వైరస్‌ సోకిందా అనే సందేహం ఊపిరాడకుండా చేసింది. ఆ తర్వాత ఆస్తవం తెలిసి అమెరికా ఊపిరి పీల్చుకుంది. నిజానికి వారంతా డ్రగ్స్‌ మత్తులో అలా ప్రవర్తించారని  అమెరికా చివరకి గుర్తించింది. 'ట్రాంక్', 'ట్రాంక్ డోప్', 'జోంబీ డ్రగ్' అనే పేర్లతో పిలిచే Xylazine అనే డ్రగ్స్ లక్షణాలు కొంత వింతగా ఉంటాయట. ఎక్కువగా నిద్రపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఇంకా చర్మంపై గాయాలు ఏర్పడి చర్మం ఊడిపోవడం.. వంటి లక్షణాలు ఇందులో కన్పిస్తాయి. ముఖ్యంగా చర్మంపై చిన్న అల్సర్ లా ప్రారంభించి అనతికాలంలోనే డెడ్ స్కిన్‌ (ఎస్చార్) బారీన పడతారు. సకాలంలో చికిత్సనందించకపోతే చర్మం శరీర భాగాలు కూడా ఊడిపోతాయి.'జోంబీ డ్రగ్' అధిక డోసులో తీసుకుంటే కోలుకోవడం దాదాపు అసాధ్యం.


సాధారణంగా నలోక్సోన్/నార్కాన్ వంటి డ్రగ్స్‌ ఓవర్ డోస్ తీసుకున్నవారు చికిత్సకు కూడా స్పందించరు. క్రమంగా ప్రాణాలు కూడా పోతాయి. జిలాజైన్ డ్రగ్‌ కేసులు మొదట ఫిలడెల్ఫియాలో బయటపడ్డాయి. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో ఇంకా లాస్ ఏంజెల్స్‌లలో వెలుగుచూశాయి.ఇక అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెటర్నరీ విభాగం జిలాజైన్ డ్రగ్‌ను వినియోగిస్తుంటారు. ఐతే ఇది జంతువులకు ఇంకా మానవులకు చాలా ప్రాణాంతకమైనది. అమెరికాలో డ్రగ్స్‌ మాఫియాల ద్వారా ఈ డ్రగ్‌ సామాన్యుల చేతిలోకి వస్తున్నట్లు, దాన్ని ఓవర్‌ డోస్‌ తీసుకోవడం వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నట్లు కొన్ని అంతర్జాతీయ వార్తాకథనాలు పేర్కొన్నాయి. ఇక న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం.. 2021 వ సంవత్సరంలో ఒక్క న్యూయార్క్‌లోనే దాదాపు 2,668 మంది ఓవర్ డోస్‌తో మృతి చెందినట్లు తేలింది. అమెరికా మొత్తం మీద జిలాజైన్ డ్రగ్‌ వల్ల 2021లో ఏకంగా 1,07,000కుపైగా మరణాలు జరిగినట్లు తేలింది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురాకుంటే పెనుప్రమాదం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: