పాకిస్థాన్ లో భారత్ కు అభినందలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ సోషల్ మీడియాలో భారత్ ను తెగ పొగిడేస్తున్నారు. భారత్ లో ఉన్న 85 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నారు. కానీ పాకిస్థాన్ లో గోధుమ పిండి కోసం కొట్టుకునే పరిస్థితి ఉంది. భారత్, పాక్ కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. భారత్ కంటే జనాభాలో చాలా చిన్న దేశం పాక్. భారత్ అనేక మతాల కలయిక. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో ముందుకు సాగుతోంది. కానీ భారత్ అంటేనే మండిపడే పాక్ జనాలు, అక్కడి అధికారులు ఇప్పుడు ఇండియాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఉచితంగా రేషన్ బియ్యం 85 కోట్ల మందికి అందిస్తున్నారంటే మామూల విషయం కాదని చెబుతున్నారు. అయితే పాకిస్థాన్ లో ఇతర మతాలపై దాడులు, హత్యలు జరిగాయి. కేవలం అక్కడ ఇప్పుడు 9 శాతం కంటే తక్కువ మంది సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు జీవిస్తున్నారు. అది కూడా ఖైబర్ పంక్తువా, గిల్టిస్తాన్ లాంటి ప్రాంతాల్లోనే వారు ఉన్నారు. మిగతా చోట్ల మొత్తం ముస్లింలే జీవిస్తున్నారు.


కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్ లో ముస్లింల సంఖ్య చాలా పెరిగింది. ఇండియాలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయి. ఇండియాలో మైనార్టీల సంఖ్య పెరిగితే... పాకిస్థాన్ లో మైనార్టీ ల సంఖ్య తగ్గిందని వారు పోస్టులు పెడుతున్నారు. నూతన పార్లమెంట్ లో సర్వమత ప్రార్థన జరిపి మోదీ ఐక్యతను చాటారని, అదే పాకిస్థాన్ లో ఇలా వేరే మతాల ప్రార్థనలు ఎప్పుడైనా జరిపారా అంటూ నెటిజన్లు ఆ దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  అక్కడి ప్రజల్లో  మార్పు వచ్చిందన్న విషయం దీనితో అర్థమవుతుంది. పెద్ద దేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తూ.. గొప్పగా ఎదుగుతోంది భారత్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: