అనంతపురం జిల్లా పర్యటనలో జగన్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ మొత్తం టీడీపీ నాయకులను కదిలించింది. అబద్దాలు చెబుతున్న సీఎం చంద్రబాబును చెప్పుతో కొట్టాలన్న మాట టీడీపీ నాయకుల మనసులను విపరీతంగా గాయపరిచింది. దాంతో మంత్రుల స్థాయి నుంచి గల్లీ లీడర్ల వరకూ స్పందించారు. ఎలాగూ జగన్ మర్యాదలో ఓ మెట్టు దిగారు కనక తామూ దిగితే తప్పులేదనుకున్నారు. 

అందుకే జగన్ ను విమర్శించే విషయంలో సభ్యతా సంస్కారాలను తిలోదకాలిచ్చేశారు టీడీపీ నాయకులు.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా.. చెప్పుతో కొడతా అంటూ తిడుతున్నవాళ్లను కూడా సాఫ్ట్ గా ఏం తిడతామనుకున్నారో ఏమో తిట్ల డోసు అమాంతం పెంచేశారు.  జగన్ మానసిక పరిస్థితి బాగా లేదన్నవాళ్లు చాలా మంది. జగన్ సీఎం పదవి దక్కలేదన్న బాధతో డిప్రెషన్ స్థాయి నుంచి కోమాలోకి వెళ్లిపోతున్నాడని పయ్యావుల కేశవ్ విమర్శించారు.

జగన్ ను తిట్టని టీడీపీ నేత లేడు.. 



జగన్ జన బలంతో రాజకీయ నాయకుడు కాలేదని.. సానుభూతితో నాయకుడు అయ్యాడని విమర్శించారాయన. ఇంకా వైసీపీ పార్టీని కొనసాగించడం అనవసరమని అభిప్రాయపడిన ఆయన విరిగిన ఫ్యాన్ ను ఓఎల్ ఎక్స్ లో అమ్మేయ్ అంటూ ఉచిత సలహా ఇచ్చేశారు.  ఇక జగన్ కు పిచ్చిపట్టింది. మెంటలెక్కింది. జగన్ అధోగతి పాలయ్యాడు అని విమర్శించిన వారికి లెక్కేలేదు. 

మరో టీడీపీ నాయకుడు మాట్లాడుతూ .. నీ పార్టీ నుంచి 20 మంది చీకొట్టి వెళ్లారు. ఇంకా అంతకు మించి ఓ నాయకుడిగా అవమానం ఏముంటుంది... నువ్వో పనికిరాని వెధవ్వి అంటూ వాళ్లు సర్టిఫికెట్ ఇచ్చారని కామెంట్ చేశాడు. జగన్ ప్రస్తుతం పిచ్చెక్కిన కుక్క అని.. పిచ్చెక్కిన కుక్కును చావగొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ కార్యకర్తలు తలా చెప్పు వేస్తే.. ఆ చెప్పుల గుట్టలో చచ్చి ఊరుకుంటారు.. రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతావు అంటూ మండిపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: