పదవి కోసం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్పై గురువారం నాడు జరిగిన దాడిపై శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం 'జగన్ మోడీ రెడ్డి' కి కొత్త కాదు. మరో సారి ఓటమి తప్పదు అనే భయంతో 'కోడి కత్తి డ్రామా' కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.
విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై గురువారం ఒక యువకుడు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం జగన్ హైదరాబాద్ చేరుకుని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరారు. జగన్కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్ పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని అదుపు లోకి తీసుకొని విచారించారు.
"జగన్ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని, ఆయనకు సానుభూతి వస్తుందని, జగన్కు అది ఉపయోగపడుతుందనే తాను దాడి చేసినట్టు నిందితుడు పోలీసుల విచారణ లో చెప్పారు"
అది వదిలేసి వైసీసీ 'కోడి కత్తి డ్రామా' ఆడుతోందన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదన్నారు. మరోసారి ఒటమి తప్పదనే భయం తోనే కోడి కత్తి డ్రామా కు తెరలేపారని జగన్ తీరును ఆయన దుయ్యబట్టారు. దాడి వెనుక ఉన్న వైసీపీ కుట్ర ప్రజలకు అర్ధమైందని, దీంతో ప్రజలను మభ్య పెట్టేందుకు వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. తండ్రి చితికి నిప్పుపెట్టక ముందే సీఎం పీఠంపై కన్నేసీన వ్యక్తి కత్తి డ్రామాలు ఆడడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఎన్ని కుయుక్తులుపన్నినా నిజంమాత్రమే ప్రజలముందు గెలుస్తోందన్నారు. చివరగా "# jagannaaTakam " (జగన్నాటకం) అంటూ హ్యాష్-ట్యాగ్ ను లోకేశ్ జోడించారు.
జగన్మోహన్ రెడ్దిపై హత్యాప్రయత్నం లాంటి సీరియస్ ఇష్యూని తెలుగుదేశం తండ్రి కొడుకులు ఒక కామెడీగా మార్చేశారు. ఏదేమైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి అనేది ప్రపంచానికి అర్ధమౌతుందని లోకెష్ కామెంట్స్ విన్నవాళ్లు అనేమాట. అధికారం కోసం అడ్దదార్లు తొక్కటానికి జగన్ సంకోచించరు అనే మాటలు పట్టుకొని అడ్డదారిలో అయ్య సహాయంతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి లోకేష్ - గుమ్మడికాయల దొంగ కనీసం భుజాలు కూడా తడుము కోకుండా మాట్లాడటం సిగ్గుమాలినతనం కాకమరేమిటని జనం అంటున్నారు. లొకేష్ అసందర్భ ప్రలాపాలకు కత్తిపోటుకు గురైన జగన్ పై వేసే తెలివిమాలిన సెటైర్లకు "జగన్ పై జనాల్లో సానుభూతి" పేరగటం తప్ప ఇంకేమీ లెదని జనం పదే పదే నొక్కి చెపుతున్నారు.
యుద్ధంలో ఓడిపోవటం గ్యారెంటీ అనితేలిన సంధర్భంలో "ఆరిపోయే దీపం ఎక్కువగా మండిపోతున్నట్లు"న్నాయి లోకేష్ మాటలని వైసిపి, జనసేన, బిజెపి లాంటి ప్రతిపక్షాలవారి తో పాటు మిత్రపక్షంలా మారుతున్న కాంగ్రెస్ వాళ్లూ నిర్ద్వందంగా కామెంట్స్ చేస్తున్నారు.
వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డి కి కొత్త కాదు. మరో సారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.