చంద్ర బాబు ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరిగిన అది మోడీ చేసిన పనే నని తన మీడియా తో చెవి కి పోటు వచ్చే విధంగా ప్రచారం చేయిస్తుంటాడు .దేవుడి గుడికి వెళ్లి తిరిగి వస్తోంటే.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ మీద కర్రలతో దాడి చేస్తారు... పోరాటయాత్రలో భాగంగా తిరుగుతూ రాత్రి ఓ కల్యాణ మండపంలో సేదతీరుతూ ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద అర్ధరాత్రి పోలీసు రక్షణ కూడా లేని సమయంలో దాడికి తెగబడతారు... ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి సిద్ధమై విమానాశ్రయ లాంజ్లో ఉంటే ఎవడో వచ్చి తటాలున పోటు పొడిచేస్తాడు... ఇలాంటి ఘటన ద్వారా అధికార పార్టీ ఏం సంకేతాలు ఇవ్వదలచుకుంటున్నది!
తిరుమల గుడిలో నగలు మాయమౌతాయ్ - అది మోడీ చేస్తున్న కుట్ర ప్రచారం! తప్పుడు వ్యాపారాల మీద ఐటీదాడులు జరుగుతాయ్- అది మోడీ పురమాయించిన పని! ఎయిర్పోర్ట్లో ప్రతిపక్షనేతను పొడిచేస్తారు... అది మోడీ స్కెచ్ ప్రకారం.. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేయించిన పని. 'ఏంజరిగింది' అని గవర్నర్ అడుగుతాడు- అది మోడీ కోసం చేస్తున్న డిటెక్టివ్ పని... ఏమిటీ ప్రచారం...? ఇలాంటి మాటల ద్వారా తెలుగుదేశం ఏం సందేశాలు చెప్పదలచుకుంటున్నది..!
ఒక్కవిషయం మాత్రం నిజం! అబద్ధాలను పునాదులుగా చేసుకుంటూ.. విపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడమే మార్గంగా ఎంచుకుంటూ... గోబెల్స్ సిగ్గుపడేలా.. దుష్ప్రచారాలను ఆలంబనంగా సాగించుకుంటూ.. తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలని చూస్తున్నది. ఇలా ప్రతి విషయం లో కేంద్రం మీద నెట్టుతుంటే అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు కదా ప్రజలు.. చివరికి జగన్ మీద జరిగిన దాడిని కూడా జగనే చేపించుకున్నాడని బాబు చెప్పడం తో కరుడు కట్టిన తెలుగు దేశం కార్య కర్తలు కు కూడా విన సొంపుగా లేదు. దీనితో చంద్ర బాబే తన గోతును తవ్వుకుంటున్నాడని అందరూ అభిప్రాయ పడుతున్నారు.