ఇటీవల తెలుగుదేశం పార్టీ నుండి చాలా మంది నేతలు వైసీపీ పార్టీ లోకి వెళ్లి పోవడం తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం చెందుతున్నారు. ఇదే క్రమంలో భారీ బహిరంగ సభల్లో కూడా ఇటువంటి నేతల గురించి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రజల ముందు ఎండగడుతున్నారు.

Image result for chandrababu vs jagan

ఇదే క్రమంలో పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు...జగన్ హైదరాబాద్‌లో విలాసంగా కూర్చుని, అక్కడే కెసిఆర్‌ సహకారంతో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు ఏపీలో నివసించడమే ఇష్టంలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు.

Image result for chandrababu vs jagan

వైఎస్‌ఆర్‌సిపి టికెట్లకు ప్రజాసేవ కొలమానం కాదు.. డబ్బు సంచులే కొలమానమని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. జగన్ ఒకసారి పోటీ చేసిన వారికి మరోసారి అంత తేలిగ్గా అవకాశమివ్వరని, డబ్బులు ఎవరికిస్తే వారికే టికెట్లు ఇచ్చే వ్యక్తి అని విమర్శించారు.

Related image

జగన్కు ఎన్నికల అంటే వ్యాపారమంటూ ధ్వజమెత్తారు. వైకాపాలో అంతా ఒక్కసారి మాత్రమే ఆడే ఆటగాళ్లని (వన్‌టైం ప్లేయర్స్‌) ఎద్దేవాచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మోడీ కేసీఆర్ సహించలేకపోతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు చంద్రబాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: