మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి ఉన్న విషయం తెలిసిందే. మహిళలపై అత్యాచారాలు చేసే వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. రోజురోజుకు కామంతో కళ్లు మూసుకుపోయి వావి వరసలు మరిచి ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన తండ్రి ఆ నలుగురు చిన్నారులకు సమస్యగా మారి పోయాడు. కూతుళ్లకు ఉన్నత జీవితాన్ని ఇవ్వాల్సిన కన్న తండ్రి... ఆ నలుగురు కూతుళ్లు జీవితాలను చిదిమేశాడు.

 

 

 వివరాల్లోకి వెళితే... కేరళలో కనీవినీ ఎరుగని రీతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మలప్పురం జిల్లా  వలంచిరి పోలీస్  స్టేషన్ పరిధిలో నివసించే 47 ఏళ్ల వ్యక్తి కుటుంబంతో సహా నివసిస్తున్నారు. దినసరి కూలీగా పని చేసే ఆ వ్యక్తికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. అయితే రోజు  ఫుల్లుగా మద్యం తాగి  భార్య పిల్లలను చిత్రహింసలకు గురి చేసే ఈ క్రూరమృగము కన్ను తన నలుగురు కూతుళ్లు పై పడింది. దీంతో మద్యం తాగి వచ్చి రోజు నలుగురు కూతురుపై అత్యాచారం చేసేవాడు ఈ కసాయి తండ్రి. తాగుబోతు గా మారి  కామంతో ఊగి పోయిన ఈ రాక్షస తండ్రి చేతిలో బలైపోయిన నలుగురు చిన్నారులు మైనర్లే . పెద్ద కూతురు 17 ఎల్లుండగా , రెండో కూతురు 15 ఏళ్ళు,  మూడో కూతురు 13ఏళ్ళు, నాలుగో కూతురు పదేళ్లు మాత్రమే ఉంది. 

 

 

 రోజూ మద్యం మత్తులో ఇంటికొచ్చిన కసాయి తండ్రులు నలుగురు కూతుళ్లు పై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజురోజుకు పెరుగుతున్న చిత్రహింసలు ఎక్కువ అవడంతో పదేళ్ల చిన్నారి తట్టుకోలేకపోయింది. దీంతో ఒకరోజు బడిలో నీరసంగా  కనిపించడంతో టీచర్ ఏమైంది అని ఆరా తీయగా... టీచర్ కు బోరున విలపిస్తూ అసలు విషయం చెప్పేసింది ఆ బాలిక. దీంతో అప్రమత్తమైన టీచర్స్ అదే  బడి లో చదువుతున్న బాలిక అక్కలను పిలిచి అడగగా వారు కూడా అసలు విషయం బయట పెట్టారు. షాక్ కి గురైన టీచర్ ప్రిన్సిపల్ సాయంతో పోలీసులకు సమాచారం అందించింది  ఇక రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు బాలికలపై అత్యాచారం చేసిన  తండ్రిని  అదుపులోకి తీసుకుని  అతని పై పోక్సో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: