ప్రేమ ఒక వ్యక్తి ప్రాణం తీసింది... తాను  ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయి తనకు ఎక్కడ దక్కదో  అని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణంగా ప్రేమించి పెళ్ళి చేసుకుని హాయిగా జీవనం గడపాలి అనుకున్నాడు. కానీ ఇద్దరు కులాలు వేరు కావడంతో... ఇద్దరి కుటుంబీకులు ఈ ప్రేమికులు ఇద్దరికీ పెళ్లి చేసేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయికి తల్లి దండ్రులు బలవంతంగా వేరే ఒకరితో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. వారిద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనతోనే జీవితం అనుకున్నా ఆ యువకుడు అమ్మాయి తనకు దూరమవుతోందని భరించలేకపోయాడు. దీంతో తాను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుంటుండటంతో  తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే పెళ్లికి ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

 

 

 ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రైల్వే స్టేషన్ వద్ద వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కొంద్గురు  మండలం కేంద్రానికి చెందిన 24 ఏళ్ల విజయ్ షాద్ నగర్ లోని ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. గురువారం పరిశ్రమలో విధులకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ఇక రాత్రిఅయిన  ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడిపోయారు. ఇక గురువారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి షాద్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని... కుటుంబీకులకు సమాచారం అందించారు.

 

 

 ఇక మృతదేహానికి షాద్నగర్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేశారు పోలీసులు.. అయితే తాను ఎంతగానో ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే యువతికి వేరొకరితో నిశ్చితార్ధం కావడంతో... తాను గాఢంగా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని... ఇక తన జీవితంలోకి రాదు అని తీవ్ర మనస్తాపం చెందిన వ్యక్తి... తాను ప్రేమించిన యువతి పెళ్లికి ఒక రోజు ముందుగానే ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా  విజయ్ మృతితో కుటుంబంలో తీరని శోకం నిండిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: