కరోనా వైరస్ తో జనం కిటకిటలాడుతున్నారు. ఈ వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండి కరోనా సోకకుండా సురక్షితంగా ఉండాలని అని ప్రభుత్వం అనేక పరిష్కారాలతో నిరంతరం కొత్త దారులని చూపిస్తోంది. ప్రజలు కరోనా రాకుండా సురక్షితంగా ఉండాలని మన భారత ప్రధాని మోదీ ఇరవై ఒక్క రోజుల పాటు లాక్ డౌన్ చెయ్యాలని ప్రకటించిన సంగతి అందరికి తెలిసినదే.
మందు షాపులు కూడా బంద్ చేసేసారు. దీనితో ఏకంగా ఫ్లాట్ లో మందు అమ్మకాలని కొన సాగిస్తున్నాడు ఒక వ్యక్తి. వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. నరసారావుపేటలో ప్రకాష్ నగర్ లో ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ పక్కన విద్య విహార్ అనే ఓ అపార్టుమెంట్ ఉంది. దానిలో ఒక ఫ్లాట్ లో దేవరకొండ అంజి రెడ్డి ఉన్నాడు. తను అక్రమంగా మద్యం అమ్మకాలని చేస్తున్నాడు.
దేశ వ్యాప్తంగా మందు షాపులు ముసినట్టు తెలిసినదే. దీనితో మందు బాబుల పరిస్థితి ఘోరం. దీనిని ఆసరాగా తీసుకుని తన ప్లాట్ లోనే అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్నాడు. ఇలా అమ్ముతున్న విషయం పోలీసులకి తెలిసి ఈరోజు దాడులు నిర్వహించారు. బాత్రూం లో మద్యం ఎక్కువ ఉంది అని పోలీసులు చెప్పారు.