జర్నలిస్టు సాయి.. తెలుగులో న్యూస్ ఫాలో అయ్యేవారికి సుపరిచితమైన పేరు. ఆయన ప్రస్తుతం ప్రైమ్ నైన్ అనే న్యూస్ ఛానల్‌లో పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో ఈనాడులోనూ, సి ఛానల్‌లోనూ, జెమినీలోనూ ఒకటి, రెండు ఇతర ఛానళ్లలనూ పని చేశారు. వీటన్నింటి కంటే ఆయన తన సొంత యూట్యూబ్ చానల్ జర్నలిస్టు సాయి ఛానల్ ద్వారా ఎక్కువ మందికి పరిచయస్తుడైన జర్నలిస్టు.

 

 

అయితే గత రెండు రోజుల్లో తెలుగు మీడియాలో జర్నలిస్టులు అటూ ఇటూ మారుతున్నారన్న వార్త సోషల్ మీడియాలోనూ బాగా చక్కర్లు కొట్టింది. నిన్న మొన్నటి వరకూ ఏపీ 24 ఇంటూ 7 లో పని చేసిన వెంకట కృష్ణ ఆ ఛానల్ కు కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. ఆయన త్వరలోనో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చేరబోతున్నారంటూ ఓ వార్త వచ్చింది. అలాగే టీవీ9 లో పని చేయడం ద్వారా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకూ వెళ్లిన జర్నలిస్టు జాఫర్ కూడా ఓ ఛానల్‌లో చేరబోతున్నాడని టాక్ వచ్చింది.

 

 

అదే సమయంలో జర్నలిస్టు సాయి కొన్ని రోజుల క్రితం ప్రైమ్ 9 టీవీ ఛానల్ కు రాజీనామా చేశారు. దీంతో ఏపీ 24 ఇంటూ 7 లో వెంకటకృష్ణ స్థానాన్ని జర్నలిస్టు సాయి భర్తీ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై జర్నలిస్టు సాయి స్వయంగా తన యూట్యూబ్ ఛానల్‌లో వివరణ ఇచ్చారు. తాను ప్రైమ్ 9 ఛానల్‌ కు రాజీనామా చేసిన మాట వాస్తవమేనన్న సాయి.. తాను ఇప్పుడే ఏ ఛానల్ లోనూ చేరబోవడం లేదని తేల్చి చెప్పారు.

 

 

కొంతకాలంగా తాను నిర్వహిస్తున్న జర్నలిస్టు సాయి యూ ట్యూబ్ ఛానల్‌కు నెలకు దాదాపు కోటికి పైగా వ్యూస్ వస్తున్నాయని.. లక్షల సంఖ్యలో ఆ యూట్యూబ్ ఛానల్‌ను ఫాలో అవుతున్నారని అందువల్ల ఇక పూర్తి స్థాయిలో యూ ట్యూబ్ చానల్ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను ఏపీ 24 ఇంటూ 7లో చేరబోవడం లేదని ఆయన వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: