ఈ మధ్య కాలంలో భారత్లో టిక్ టాక్  ప్రభావం ఎంతగానో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇక టిక్ టాక్ లో లైకులు తెచ్చుకోవడానికి చిత్రవిచిత్రంగా ప్రయత్నిస్తున్నారు ఎంతో మంది. కొంతమంది కేవలం సినిమా డైలాగులు చెబుతూ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటే కొద్దిమంది మాత్రం చిత్రవిచిత్రంగా ఏవేవో చేస్తూ లైకులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేస్తుంది టిక్ టాక్. ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లో టిక్ టాక్ ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు. అందరు  జనాలని ప్రభావితం చేసింది ఈ టిక్ టాక్. ఇక ఈ టిప్ టాప్ ద్వారా మేలు జరగడం ఏమో కానీ ఎక్కువగా కీడే  జరుగుతుంది.

 

 తాజాగా టిక్టాక్ కారణంగా ఓ యువకుడు జైలు పాలయ్యాడు. తెలిసీ తెలియక చేసిన పనికి ఏకంగా ఊచలు  లెక్కపెట్టాల్సిన దుస్థితి వచ్చింది. అనంతపురం జిల్లాలో జరిగింది ఈ ఘటన . వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా కంబదూరు మండలం మల్లం పల్లి గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు టిక్ టాక్ కారణంగా జైలు పాలయ్యాడు. అయితే గొర్రెలకాపరి అయినా నాగార్జున ఆత్మకూరు రేంజ్ అటవీ పరిధిలో గొర్రెలను కాస్తున్న సమయంలో.... అటవీ ప్రాంతంలో ఓ చిన్న జింక పిల్లని పట్టుకొని.. ఆ జింక పిల్లకు మేక పాలు తాగిస్తు  ఓ టిక్ టాక్ వీడియో చేసాడు. అంతటితో ఆగకుండా ఆగలేదు. 

 

 ఇక ఆ తర్వాత కుందేలు మాంసం ని కుక్క లకు వేస్తున్నా దృశ్యాన్ని కూడా చిత్రీకరించి టిక్ టాక్ లో అప్లోడ్ చేశాడు. ఇక ఇలా విచిత్రంగా లైకుల కోసం చేయడంతో ఇది కాస్త టిక్ టాక్ లో వైరల్ గా మారిపోయింది. చివరికి అధికారుల దృష్టికి వెళ్లింది ఈ వీడియో. ఇక సదరు వ్యక్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిందితుడు నాగార్జున పట్టుకున్న అటవీశాఖ అధికారులు... అతనిని రిమాండ్కు తరలించారు. ఇక అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇలా టిక్ టాక్ ఎంతో మంది జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: