ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను వనికిస్తో వస్తుంది..కేవలం ఒక్కరోజులో కొన్ని వేల మందికి కరోనా సోకింది.. రోజు రోజుకు ప్రభావం పెరుగుతుండటంతో ప్రజల మధ్య సామాజిక దూరం పాటించాలని లాక్ డౌన్ అమలు చేస్తున్నారు..ఈ లాక్ డౌన్ కారణంగా పనులన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే ఎంత కట్టడి చేస్తున్న కూడా కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది..దీంతో ఇప్పుడు చాలా కఠినంగా చర్యలు అమలు అవుతున్నాయి.. 

 

 

 

 

హైదరాబాద్‌లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పోలీసు శాఖలోనూ కోవిడ్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తొలి నాళ్లలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన సిబ్బందే కరోనా బారిన పడగా.. పోలీసు కమిషనరేట్ సిబ్బందితోపాటు ఏఆర్ సిబ్బంది కూడా కోవిడ్ బాధితుల జాబితాలో చేరారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 50 మందికిపైగా కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. చాలా మంది క్వారంటైన్లో ఉన్నారు.

 

 

 

 


ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఎస్సై కుటుంబంలో 11 మంది కోవిడ్ బారిన పడ్డారు. పాతబస్తీలో నివాసముంటున్న ఆ ఏఎస్సై కొడుకులిద్దరూ కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆ ఏఎస్సై మనవడికి ఒంట్లో నలతగా ఉండటంతో చిన్నపిల్లల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. రాత్రుళ్లు అక్కడే ఉండి మనవడి బాగోగులు చూసుకున్నారు.రెండు రోజుల తర్వాత దగ్గు, జలుబు రావడంతో.. సెలవు పెట్టి ఇంట్లో ఉన్నారు. అనుమానం వచ్చి కోవిడ్ పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయన భార్య, కుమారులు, కోడల్లు, వారి సంతానాన్ని క్వారంటైన్‌కు తరలించి కరోనా టెస్టులు చేయగా.. వారికి కూడా పాజిటివ్‌ అని తేలింది. వారందరూ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: