ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే హత్యలు ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. రోజురోజుకు అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్న కారణాలతోనే మనస్థాపం చెంది బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి  సంఖ్య ఎక్కువవుతోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏకంగా  ప్రాణాలు తీస్తున్నాయి. ఆ తర్వాత పశ్చాత్తాపం పడడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఓ భర్త తన భార్యను మర్చిపోలేక ఏకంగా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

 వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా గుడివాడలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.నాగవరప్పాడు కు చెందిన పెదపూడి శ్రీకాంత్ అనూష అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిద్దరి కాపురం కొన్ని రోజులపాటు ఎంతో సాఫీగా సాగిపోయింది. కొన్నాళ్ల తరువాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవడంతో మనస్పర్థలు వచ్చి తరచూ గొడవలు పడుతూ ఉండేవారు అనూష శ్రీకాంత్. దీంతో భర్త తీరుతో తీవ్ర మనస్థాపం చెందిన అనూష గతేడాది సెప్టెంబర్ లు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

 


 అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చనిపోవడంతో భర్త శ్రీకాంత్ ఎంతగానో కుంగిపోయాడు. మానసికంగా ఎంతో పశ్చాత్తాపానికి గురయ్యాడు. ఎన్నో రోజుల పాటు భార్యను గుర్తు చేసుకుంటూ ఎంతో మనస్థాపానికి గురయ్యాడు. అయితే ఎంత ప్రయత్నించినా భార్య జ్ఞాపకాల నుంచి మాత్రం బయటకు రాలేక పోయాడు శ్రీకాంత్. గత కొద్ది రోజుల నుంచి ఆమె దుస్తులను మంచం పై  పెట్టుకొని పడుకోవడం మొదలుపెట్టాడు. భార్యను తలుచుకుంటూ ఇంట్లోనే ఏడుస్తూ గడుపుతున్నాడు. దీంతో భార్య లేని బ్రతుకు తనకు ఎందుకు అనుకున్నాడో ఏమో... భార్య చున్నీతో ఉరివేసి కొని బలవన్మరణానికి పాల్పడ్డాడు, ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య చనిపోయిన కొన్ని నెలలకే భర్త కూడా ఆత్మహత్య చేసుకోవటం  స్థానికంగా ఎంతో విషాదాన్ని నింపింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: