అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ లో జరిగింది ఈ దారుణ ఘటన. వివరాల్లోకి వెళితే... ఎఫ్ బ్లాక్ లో నివాసముంటున్న వేముల రామకృష్ణ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు, భార్యతో మనస్పర్థలు రావడంతో విడిపోయిన రామకృష్ణ ప్రస్తుతం తన ఆరేళ్ల కుతూరు, తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవలే సాయంత్రం సమయంలో రామకృష్ణకు స్నేహితుడి నుండి ఫోన్ రావడంతో బయటికి వెళ్లాడు. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రామకృష్ణ అతని స్నేహితుడైన తన్నీరు ఆంజనేయులు, పండు, సునీల్ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు.
కానీ ఇంతలో రామ కృష్ణ ఆంజనేయులు మధ్య గొడవ మొదలైంది. పక్కనే ఉన్న మిగతా స్నేహితులు వీరిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో ఆంజనేయులు రామకృష్ణ పై దాడి చేశాడు. చాతిలో పొడవడంతో తీవ్ర రక్తస్రావం అయిన రామకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక ఆ తర్వాత స్నేహితులు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ హత్య పోలీసులకు సవాల్ గా మారిపోయింది. ఇక మృతుడి సోదరుడు తెలిసిన వ్యక్తులే తన అన్నను చంపి ఉంటారని అనుమానం తో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి ఎంతో చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి