డిజిటల్ కాలంలో డబ్బులు సంపాదించడం ఒక ఎత్తయితే. ఆ ధనాన్ని దాచుకోవడం మరో ఎత్తు అయిపోయింది. కష్టపడి సంపాదించిన ధనాన్ని సంరక్షించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు కస్టమర్లు పెద్ద  ఎత్తున మొత్తాన్ని ఇంట్లో దాచుకోవడం అంత సురక్షితం కాదు.... పొరపాటున దొంగలు పడితే అంతా దోచుకు పోతారు... అటు షేర్ మార్కెట్ లలో లేదా ఇతర మార్గాల్లో ఇన్వెస్ట్ చేద్దామంటే సైబర్ నేరగాళ్లు ఎప్పుడు... ఎలా... డబ్బులు ఖాళీ చేస్తారో అన్న  భయం. ఇక అన్నింటికన్నా మిన్న అనుకొనే బ్యాంకులు కూడా కొత్త తంటాలు తెచ్చిపెడుతున్నాయి.. గతంలో కొన్ని బ్యాంకులు దివాలా తీసి  కస్టమర్స్ కు వారి డబ్బును డ్రా చేసుకోవడానికి ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు పంజాబ్ మహారాష్ట్ర బ్యాంకులు సైతం ఇదే విధంగా నష్టాల్లో కూరుకుపోయి ఖాతాదారులకు పరిమితులు విధించాయి.

ఇలా ఎటు చూసినా అయోమయ పరిస్థితి. ఎంతో శ్రమించి సంపాదించిన ధనాన్ని ఎక్కడ దాచుకుంటే మంచిది...??? ఎంత మొత్తంలో దాచుకుంటే మంచిది....??? అన్న ప్రశ్న సామాన్యులకు అర్థం కాకుండా ఉంది. అయితే ఈ మధ్యే లక్ష్మీ విలాస్ బ్యాంకు తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. దీంతో డిపాజిటర్లకు డబ్బు విత్ డ్రాపై ఆర్బీఐ పరిమితులు విధించింది. గరిష్టంగా రూ.25000 వరకు మాత్రమే తీసుకోవచ్చని సూచించడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ ఏదైనా బ్యాంకు నష్టానికి గురైతే ఆ బ్యాంకు నుండి ఒక ఖాతాదారుడు రూ.5 లక్షలకు మించి డ్రా చేయడానికి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలకు వరకు మాత్రమే బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ పరిమితికి మించి ధనాన్ని బ్యాంకులో దాచేందుకు ఖాతాదారులు వెనుకంజ వేస్తున్నారు.  

ఇప్పుడు ఇదే తరహాలో తాజాగా లక్ష్మీవిలాస్ అనే బ్యాంకులో రూ.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారు తమ డబ్బును వెనక్కి తీసుకునేందుకు వివిధ మార్గాలలో ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూసిన ప్రజలు డబ్బులను బ్యాంకులో దాచడానికి ఆలోచిస్తున్నారు. కాగా బ్యాంక్ నిపుణులు డబ్బును ప్రైవేటు బ్యాంకుల్లో కంటే ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.... ఎందుకంటే ప్రభుత్వ బ్యాంక్ అయితే ఒకవేళ బ్యాంకు నష్టపోయిన డిపాజిటర్లకు వాళ్లు దాచుకున్న మొత్తం .5 లక్షలకు మించిన ఆ ధనాన్ని చెల్లించడానికి ప్రభుత్వం హామీ గా నిలబడి చెల్లిస్తుంది... కానీ  ప్రైవేట్ బ్యాంకు కు ఈ పరిస్థితి వస్తే పరిమితులు విధిస్తారు. .... ఇక మరో సలహా ఓకే బ్యాంకులో ఎక్కువమొత్తాన్ని ఉంచకుండా రెండు మూడు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: