ఈ మధ్య కాలంలో మానవ బంధాలకు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే ఏకంగా కట్టుకున్న వారిని కాదని సుఖం కోసం పరాయి వ్యక్తుల మోజులో పడి చివరికి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు ఎంతోమంది. రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అనే విషయం తెలిసిందే.  ఇక్కడ ఎలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్లపాటు తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన మహిళ చివరికి బ్రేకప్ చెప్పింది అని కోపంతో ఓ వ్యక్తి ప్రియురాలిని మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు.



 ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న  సమయంలో తీసిన ప్రైవేట్ ఫోటోలు అన్నింటినీ కూడా పిల్లలకు పంపించడం మొదలు పెట్టి మరింత  వేధింపులకు గురి చేశాడు. దీంతో చేసేదేమీ లేక మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. అంబవడి  లో నివసిస్తున్న మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదిహేనేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ క్యాటరింగ్ ఏజెన్సీ లో పనిచేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటుంది అయితే ఏడాదిన్నర క్రితం ఆమె తో పాటు పనిచేసే మితేష్  అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి  వివాహేతర సంబంధానికి దారితీసింది.



 కొన్నాళ్లపాటు  వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది అయితే తర్వాత వివాహేతర సంబంధం పిల్లలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావించిన మహిళ మితేష్ ను  దూరం పెరుగుతూ వచ్చింది. కానీ ప్రియురాలు ఇలా దూరం పెట్టడం అతనికి నచ్చలేదు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక ఓ రోజు ఏకంగా మహిళతో ఏకాంతంగా దిగిన ఫోటోలను ఆమె పిల్లలకే పంపించడంతో అందరూ షాక్ అయ్యారు... ఇక చేసేదేమీ లేక మహిళ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు తోసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: