అందరి పై పంజా విసురుతున్న  మహమ్మారి కరోనా వైరస్ ఎన్నో విషాదకర ఘటనలకు  కారణం అవుతుంది. ఎంతోమందికి ప్రియమైన వారిని దూరం చేస్తూ దిక్కుతోచని స్థితిలో పడేస్తోంది. మనుషులందరిలో బంధాలు బంధుత్వాలు మరిచిపోయే విధంగా చేస్తుంది మహమ్మారి కరోనా. సాటి మనిషి కళ్ళముందే ప్రాణాలు కోల్పోతున్న ఎవరు కూడా పట్టించుకోకుండా దూరం వెళ్లే పరిస్థితిని తీసుకువచ్చింది.  అంతేకాకుండా ప్రియమైనవారి కడచూపు కూడా దక్క కుండా చేస్తుంది కరోనా రక్కసి. ఇలా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉన్న నేపథ్యంలో ఎన్నో విషాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 మనసును కలిచి వేసే ఎన్నో ఘటనలు కు కరోనా  రక్కసి కారణం అవుతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ఇక ఆ కూతురు తల్లె ప్రాణంగా బతికింది.  తల్లి లేకుండా అసలు తన జీవితాన్ని కూడా ఊహించుకోలేక పోయింది. ఇక తల్లితో కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండగా వారి సంతోషాన్ని చూసి కరోనా వైరస్ ఓర్వ లేక పోయింది. తల్లిపై పంజా విసిరింది. దీంతో ఇక ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ తో పోరాడుతూ తల్లి ప్రాణాలు వదిలింది. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయినా ఆ కూతురు చివరికి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదిలే పరిస్థితి ఏర్పడింది.



 ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ సోకి తల్లి చనిపోయింది అనే బాధ తట్టుకోలేక కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. రాయసన్ జిల్లాకు చెందిన ఓ మహిళ  వైరస్ తో రెండు రోజుల క్రితం మృతి చెందింది. అయితే తల్లి మరణం  కూతురు జీర్ణించుకోలేక పోయింది. తల్లి మరణించినప్పటి నుంచి అన్నం తినడం మానేసింది. ఇక ఇటీవల ఆత్మహత్య చేసుకోవాలని భావించి అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఆపేందుకు ప్రయత్నించినా వినకుండా ఇక అలాగే దూకింది దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: