అయితే ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్ లు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకు పోతుందని... పథకాల పేరుతో జగన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాదు పలు ప్రాజెక్టుల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోంది అంటూ విమర్శలు చేస్తున్నారు అయితే తాజాగా వీటిపై స్పందించిన విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లను ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు లోకేష్ లను ప్రజలు ఉరితీస్తారు అంటూ ఘాటు విమర్శలు కూడా చేశారు విజయసాయిరెడ్డి. ఒకవేళ నడిరోడ్డు మీద ఉరితీయాలి వస్తే మొదట మీ తండ్రి కొడుకులకు ప్రజలందరూ ఆ శిక్ష వేస్తారు అంటూ వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధినీ 20 ఏళ్ళు వెనక్కి నెట్టినందుకు ఇక మీ తండ్రి కొడుకులు ఇద్దరినీ కూడా ప్రకాశం బ్యారేజీపై ఉరి తీసి వేలాడ దీయడం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు. మీ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల దోపిడీకి పాల్పడి కూడా ఇక ఇప్పుడు నిర్భయంగా సుద్దులు చెబుతున్నారనీ.. మీ బ్రీడ్ మీ బ్లడ్ పూర్తిగా వేరే లోకేష్ అంటూ సోషల్ మీడియా వేదిక ఇటీవల విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయ్.