తాజాగా చూస్తే గత రెండు నెలల నుండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు కొద్ది రోజులు ఆలస్యంగా వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా కథనాల ప్రకారం అయితే సగం జీతాలే ఇస్తున్నారని, మరి కొందరేమో అసలు జీతాలే ఇవ్వట్లేదని చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా పలు రకాల చర్చలు జరిగేలా అవకాశమిచ్చింది ఏపీ ప్రభుత్వమేనని ప్రతి పక్షాలు సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రము ఇప్పటికే వరల్డ్ బ్యాంకు మరియు రిజర్వు బ్యాంకు ల దగ్గర నుండి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకుని సంక్షేమానికని ఖర్చు పెడుతుంటే భవిష్యత్తులో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వగలరో లేదో అర్ధం కావట్లేదని సీనియర్ పొలిటికల్ లీడర్స్ అనుకుంటున్నారు.
దీనిని బట్టి జగన్ త్వరిత ఆదాయ వనరులను తయారుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రానికున్న ఏకైక ఆదాయ వనరు మద్యం మాత్రమే. దీనిని ఆసరాగా చూపించే ఇప్పటి వరకు అప్పులు తీసుకున్నారని సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వడం చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి భవిష్యత్తు ఏ విధంగా మారనుందో ఆలోచిస్తేనే చాలా భయంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ త్వరలోనే తనపై వస్తున్న పాలనాపరమైన అన్ని విమర్శలకు సమాధానం ఇస్తాడా అన్నది చూడాలి.