ఫ్రాన్స్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ గురించి ప్రపంచం అంతటికీ తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపుగా ఈయన ఊహించిన విధంగానే సంఘటనలు జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా 2021 సంవత్సరం గురించి నోస్ట్రడామస్ చెప్పిన విషయం సరిగ్గా జరిగింది. ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దుర్ఘటనలు మానవుని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. నిరంతరం ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంది. వ్యాధులతో ప్రపంచ అల్లకల్లోలం అవుతుంది అన్న మాట నిజమైంది. కరోనా వైరస్ విడతల వారీగా ఎంతలా మానవ జాతిపై విరుచుకుపడిందో ప్రత్యక్షంగా అనుభవించాము. ఈ ఘటనతో ఆయన ఊహాలపై మరింత నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆయన పుస్తకంలోని కొన్ని విషయాలు భయం గొల్పుతున్నాయి.

వాటిలో ముఖ్యంగా ఒక విషయం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అంతరిక్షం ద్వారా మానవజాతికి ప్రమాదం పొంచి ఉందని ఇతని పుస్తకం ద్వారా తెలుస్తోంది. ఆకాశం నుండి ఉల్కలు, గ్రహశకలాలు భూమిని ఢీ కొడతాయని చెప్పుకొచ్చాడు. దీని వలన మానవ జాతికి తీవ్ర నష్టం కలుగుతుందని ఈయన బుక్ లో రాశారు. గ్రహ శకలాలు భూమికి సమీపంగా రాగానే అక్కడ రాపిడి వల్ల మండుతాయని చెప్పారు. అయితే వచ్చే సంవత్సరం ఈ ఘటన ఎప్పుడు సంభవిస్తుంది అనేది తెలియకపోయినా, ముందు నుండే  దీనికి ప్రిపేర్ అయి ఉండాలని ఇది తెలిసిన పలువురు సూచిస్తున్నారు.

మరి కొందరు ఆయన చెప్పినవి అన్నీ జరుగుతున్నప్పటికీ అన్నింటినీ మనము నమ్మలేని పరిస్థితి. వాతావరణంలో సంభవించే మార్పులు కారణంగా కూడా ఇలా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరి ఇలా అన్నీ అశుభాలు జరగడం ప్రపంచ వినాశనానికి ఆరంభమా? త్వరలోనే ప్రపంచం అంతం కానుందా? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ముందు ముందు ఏమి జరగనుందో మానవునిగా మనము ఊహించలేము. ఆ పరమాత్ముడు ఏది తలిస్తే అదే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: