భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది. ఇక్కడ బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయ్.. అలాగే, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా నాలుగు రోజుల పాటు నిర్విరామంగా ప్రయాణించే రైలు కూడా ఉంది! అదే మన దేశంలో అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే 'వివేక్ ఎక్స్‌ప్రెస్' (Vivek Express)! ఈ రైలు కథ.. ఒక సాహస యాత్ర కంటే తక్కువేం కాదు.వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? ఒకవైపు అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి మొదలై, దక్షిణ భారతదేశపు చివరి అంచున ఉన్న తమిళనాడులోని కన్యాకుమారి వరకు సాగుతుంది. అంటే.. భారతదేశపు ఒక చివర నుంచి మరో చివరకు సాగే ఈ ప్రయాణం... సాధారణ ప్రయాణం కాదు, ఒక సాహస యాత్ర!


దూరం: ఇది కవర్ చేసే మొత్తం దూరం దాదాపు 4,200 కిలోమీటర్లు (4189 కి.మీ.).

సమయం: ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 74 నుంచి 80 గంటలు (నాలుగు రోజులు) పడుతుంది.

రాష్ట్రాలు: ఈ ప్రయాణంలో ఈ రైలు ఏకంగా 9 రాష్ట్రాల మీదుగా వెళుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.


వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలంటే కేవలం టికెట్ ఉంటే సరిపోదు.. సహనం కూడా కావాలి. రైల్వే స్టేషన్లలో ఈ రైలు 50 నుంచి 59 చోట్ల ఆగుతుంది. అంటే, ఇది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడమే కాదు, భారత దేశం యొక్క విభిన్న భౌగోళిక రూపాన్ని చూపుతుంది. అస్సాం తేయాకు తోటల నుంచి దట్టమైన అడవులు, మైదానాలు దాటుతూ చివరకు కన్యాకుమారి తీరాన్ని చేరుకునే ఈ జర్నీ... ప్రయాణికులకు ఒక అవిస్మరణీయ అనుభూతిని ఇస్తుంది.



మరోవైపు, ఇంత సుదీర్ఘ ప్రయాణం కారణంగా ఇందులో ప్రయాణించేవారు ఎదుర్కొనే కష్టాలు కూడా తక్కువేం కాదు. అందుకే కొందరు నెటిజన్లు దీనిని 'సహనం పరీక్షించే ఎక్స్‌ప్రెస్' అని సరదాగా కామెంట్లు చేస్తుంటారు. అయినా సరే, దేశంలోని అత్యంత చారిత్రక ప్రాంతాలను చూపిస్తూ, కోట్లాది మందికి సేవలు అందిస్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్.. భారతీయ రైల్వే గర్వకారణంగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: