అయితే రాష్ట్రంలో పరిస్థితులు నెమ్మదిగా మారాయి. బీజేపీతో మొదట్లో కలిసొచ్చిన నెయ్యం ఆ తరువాత కయ్యంగా మారింది. ఆ పార్టీ ఏకంగా అధికార పీఠానికే గురిపెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోపక్క కేటీఆర్కు భవిష్యత్తులో అడ్డుకాకూడదనే కారణంతోనే మేనల్లుడు హరీష్రావుకు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ప్రాధాన్యం తగ్గించారన్న విమర్శలు ఎదురుకాగా, ఉద్యమ సహచరుడు ఈటెల రాజేందర్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఆ విమర్శలు నిజమేనన్న అభిప్రాయాన్నిప్రజల్లోనూ కలిగించాయి. అంతేకాదు.. ఈటెల టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరి ఇప్పుడు కేసీఆర్ మీద ఏకంగా యుద్ధమే ప్రకటించారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా క్రమేణా పుంజుకుంటూ టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో సవాల్ విసురుతోంది. ఇక కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే సానుకూల అంశాలు ప్రస్తుతం ఆయనకేమీ కనిపించడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహం మార్చుకున్నారని, ముందు రాష్ట్రంలో పార్టీ బలాన్ని, అధికారాన్ని నిలుపుకోవడం పైనే దృష్టి పెట్టారని.. అందులో భాగంగానే హరీష్రావును దగ్గరకు చేర్చుకుని మళ్లీ ఎన్నికల టీమ్ను సిద్ధం చేసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి తెలంగాణలో ముందస్తు ఎన్నికలున్నా లేకున్నా పార్టీ మళ్లీ గెలిస్తేనే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ఉంటుందని ఫిక్స్ అయిపోవచ్చన్నమాట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి