ప్రపంచ దేశాలు మొత్తం హెచ్చరికలు జారీ చేస్తున్న చైనా తీరులో మాత్రం మార్పు రావడం లేదు. విస్తరణ వాద ధోరణితో సామ్రాజ్యవాద కాంక్షతో ముందుకు సాగుతూనే ఉంది చైనా. ఈ క్రమంలోనే పొరుగున ఉన్న చిన్న దేశాలైన టిబెట్ హాంకాంగ్ లాంటి దేశాలు తమ దేశంలో కలుపుకొన్న చైనా ఇక ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్న తైవాన్ పై కన్నేసింది. ఈ క్రమంలోనే తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి గత కొన్ని రోజుల నుంచి చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించి యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండటం చేస్తుంది.. ఇలా తైవాన్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అనే చెప్పాలి.


 అయితే తైవాన్ ను తాము స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేస్తుంది. అయినప్పటికీ అటు చైనా మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు అనే చెప్పాలి. తమ సార్వభౌమత్వాన్ని చైనా దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేమని.. తమ ప్రజలందరూ చైనా కు బానిసలుగా బతకడం కంటే ప్రాణాలకు తెగించిపోరాటానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఇప్పటికే తైవాన్ అటు చైనా కు హెచ్చరికలు కూడా జారీ చేసింది అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ అటు చైనా సరిహద్దుల్లో కవ్వింపు లకు పాల్పడుతూనే ఉంది.



 ఈ క్రమంలోనే ప్రపంచదేశాలను ఏకం చేస్తూ మద్దతు కూడగట్టడంలో తైవాన్ సక్సెస్సవుతుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు చైనాకు మిత్ర దేశంగా ఉన్న లిథువేనియా తాము తైవాన్ ను స్వతంత్రదేశంగా గుర్తిస్తున్నాము అంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో కడుపుమంటతో ఏకంగా లిథువేనియా కు సంబంధించిన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తే నిషేధం విధించింది చైనా. ఇలాంటి సమయంలో తైవాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా లిథువేనియా లో 200 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడానికి తైవాన్ సిద్ధమైంది దీంతో చైనా కు షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: