
ఇంతకీ సమీర్ జనసేన అధినేత గురించి ఏమన్నారు అంటే... నాగబాబు గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన్ను తరచూ కలుస్తుంటా..సెట్స్ లో కళ్యాణ్ బాబు గారితో కూడా మాట్లాడుతుంటా.. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత..వేరుగా ఉంది. పాలిటిక్స్ లోకి వచ్చాక ఈసారి చాలా డిఫరెంట్గా ఉండబోతోంది అని ఆయన అన్నారు . ఇక రానున్న ఎన్నికల విషయానికి వస్తే....గతసారి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎన్నికల్లో కూడా అలాంటి రిజల్టే వస్తుంది అనుకునేరు. పోయిన సారి జస్ట్ ట్రెయిలర్ అంతే...కానీ ఈసారి జనసేన పార్టీ ప్రభావం భారీగా ఉండబోతుంది అని అన్నారు. రాబోయే 2024 ఏపి ఎన్నికల్లో జనసేన పార్టీతో డైరెక్ట్గా సినిమానే చూడటం పక్కా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సమీర్.
అప్పటికి ఇప్పటికి జనసేన పార్టీ అంటే జనాల్లో ఉన్న భావనలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తన కేరాఫ్ అడ్రెస్స్ వైజాగ్ అని అక్కడి జనాలను చూసే ఈమాట అంటున్నాను అని అన్నారు. పవన్ కూడా ఈసారి తన మార్క్ చూపించడానికి రెడీగా ఉన్నారు. అప్పట్లో ఓసారి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయమని అడిగారని అయితే తనకి కూడా మార్క్ ఉన్నప్పటికీ తనకన్నా తోపులు పాలిటిక్స్ లో చాలామందే ఉన్నారు అని, వారి ముందు నిలబడి గెలవడం కష్టం అని అన్నారు. అందుకే సున్నితంగా వద్దని చెప్పేశాను అని అన్నారు. అలాగే వైజాగ్లో తనకు గ్యాంగ్లు ఎక్కువని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి పవన్ కనుక తన పార్టీలోకి రమ్మని ఆఫర్ ఇస్తే తప్పకుండా జనసైనికుల్లో ఒకడిగా అవ్వాలని ఉంది. కానీ రాజకీయాలంటే ఎందుకో చిన్న భయం కానీ పవన్ గారు పిలిస్తే మాత్రం ఆలోచిస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు సమీర్. అయితే ఈ వ్యాఖ్యలను బట్టి తనకు వైజాగ్ నుండి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లుంది. మరి సమీర్ కు వైజాగ్ ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అన్నది మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది.