ఇక బియ్యం సేకరణ నిలిపివేయడం పై కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేయడం జరిగింది.అన్న యోజన పథకం కింద పేద ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగా విఫలమైందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ప్రకటనలో ఆరోపించడం జరిగింది. అందుకే ఇక కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సెంట్రల్ పూల్‌లోకి సేకరించడాన్ని నిలిపివేసిందని, ఇక ఆ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే సృష్టించిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ పేర్కొనడం జరిగింది. ఇంకా అలాగే అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను కూడా అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగా విఫలమైందని, కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోని వైనాన్ని గమనించిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆరోపించడం జరిగింది. ఇంకా అలాగే మొత్తం 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచుల మాయమవడాన్ని గుర్తించామని,అలాగే డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపడం జరిగింది.


మళ్లీ మే నెల 21 వ తేదీన మొత్తం 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశాన్ని గుర్తించామని, ఇంకా అలాగే 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం సంచులను కూడా నిల్వచేశారని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని,వాటి అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అన్న యోజన పథకం కింద ఏప్రిల్-మే నెలల కోటా వచ్చేసి మొత్తం 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపడం జరిగింది. కానీ ఆ బియ్యాన్ని లబ్దిదారులకు అందకుండా చేసిందని,ఇక ఈ కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణను కూడా నిలిపివేసిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: