ఇక మీరు కూడా ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకున్నట్లయితే, మీకు ఒక గుడ్ న్యూస్. ఇక్కడ ఎయిర్ ఏషియా మీకు చౌకైన విమాన ప్రయాణ ఎంపికను అందిస్తోంది.కేవలం రూ. 1499తో విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకునే సౌలభ్యం మీకు కల్పిస్తోంది. 2022లో ఆగస్టు 15, డిసెంబర్ 31, 2022 మధ్య ఎప్పుడైనా దేశంలోని ఏ మూలకైనా ఇదే ధరకు మీరు ప్రయాణించవచ్చు. ఎయిర్ ఏషియా ఇండియా విమాన ప్రయాణికులను ప్రోత్సహించేందుకు ఈ కొత్త ఆఫర్‌ను ప్రారంభించడం జరిగింది. అలాగే దీని కింద తక్కువ ధర చెల్లించి విమానంలో ప్రయాణించవచ్చు. ఎయిర్ ఏషియా 'పే డే సేల్' కింద కేవలం రూ. 1499కి టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. ఇక దీని కింద ఆసక్తి కలిగిన ప్రయాణికులు జూలై 31, 2022 తేదీలోపు విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవాలి.ఎయిర్ ఏషియా జూలై 28 వ తేదీ నుండి టిక్కెట్ల బుకింగ్ ప్రారంభించింది.


ఈ విషయాన్ని విమానయాన సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇందులో మీరు జూలై 31 వ తేదీ వరకు చౌకగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని, 15 ఆగస్టు నుండి 31 డిసెంబర్ 2022 మధ్య ప్రయాణించవచ్చని కూడా తెలిపింది. airasia.co.in వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఇక యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మీరు టాటా న్యూ యాప్ సహాయంతో టిక్కెట్లను కనుక బుక్ చేసుకుంటే, మీరు ఛార్జీలలో తగ్గింపును పొందడమే కాకుండా ఇంకా మీకు 5 శాతం రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి.అలాగే ఇది మాత్రమే కాకుండా, మీరు టాటా న్యూ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై బ్యాడ్జ్ ఆధారిత తగ్గింపులను కూడా మీరు పొందుతారు. ఎయిర్ ఏషియా ఇండియా గతంలో కేవలం రూ.1497కే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఇక దీని కింద, జూలై 7 ఇంకా 10 మధ్య టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: