రాయలసీమలోని అనంతపూర్ జిల్లాలోని రాజకీయాలు ఎప్పుడు కూడా వాడి వేడిగానే కొనసాగుతూ ఉంటాయి.. ముఖ్యంగా నిన్నటి రోజున చంద్రబాబు టిడిపి అభ్యర్థుల చివరి జాబితాను విడుదల చేశారు.. అప్పటినుంచి పలు ప్రాంతాలలో టిడిపి కార్యాలయాల వద్ద చాలా ఉధృత నెలకొంది.. ఇండియన్ హెరాల్డ్ కు అందిస్తోన్న సమాచారం ప్రకారం గుంతకల్ టిడిపి కార్యాలయం వద్ద చాలా ఉధృక్తత నెలకొంది. టిడిపి అభ్యర్థి గుమ్మనూరు జయరాం కు సీటు ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ అనుచరులు టిడిపి పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ నానా హంగామా చేస్తున్నారు.



ఇండియన్ హెరాల్డ్ వచ్చిన సోర్స్ మేరకు టిడిపి పార్టీ జెండాలను పత్రాలను కూడా వేసి పెట్రోల్ పోసి మరి తగలబెట్టేస్తున్నారు.. పార్టీ కోసమే కష్టపడినటువంటి జితేందర్ గౌడ్ కు కాకుండా ఇతర జిల్లా వచ్చి టిడిపిలోకి చేరగానే వైసిపి మాజీమంత్రి గుమ్మనూరు జయరాం కి టిడిపి టికెట్ కట్టడంతో గుమ్మనూరు జయరాం పైనా మాజీ మంత్రి జితేందర్ గౌడ్ కార్యకర్తలు.. చంద్రబాబు పైన మాటలలో చెప్పలేని దూషణలను కూడా చేస్తున్నారు. అంతేకాకుండా టిడిపి పార్టీకి వ్యతిరేకంగా కూడా పలు నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు.


ఇండియన్ హెరాల్డ్ అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు సైతం చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొడుతూ చంద్రబాబు ఫోటో ఫ్రేమ్ ను మంటలలో వేశారు.. అలాగే చంద్రబాబు చేసినటువంటి పథకాల గురించి తయారుచేసిన జాబితాను కూడా పెట్రోల్ పోసి మరి నిప్పంటించారు. దీంతో ఒక్కసారిగా అక్కడి రహదారులు సైతం టిడిపి కార్యకర్తలు నాయకులు  బీభత్సం సృష్టించారు..


ఇండియన్ హెరాల్డ్ వచ్చిన సోర్స్ మేరకు.. గుంతకల్లు నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం కు సహకరించబోమంటూ అక్కడి నేతలతో పాటు టిడిపి మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కూడా తెలియజేశారు.. వీటితో పాటు చంద్రబాబు రూ .150 కోట్లకు సైతం అమ్ముడు పోయి  జయరాంకు సీటు ఇచ్చారని ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు.. కార్యాలయంలో ఉండేటువంటి అద్దాలు ఫర్నిచర్లను సైతం పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: