- ఏపీలో బాబు - జగన్ ఇద్దరి జాతక బలాలు ఈక్వల్.. హోరాహోరీ సమరం తప్పదు..?
- పవన్, లోకేష్ ఈ సారి అసెంబ్లీకి పక్కా
- శుక్ర ప్రభావంతో మహిళా లీడర్ల హవా
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
క్రోధి నామ ఉగాది నూతన సంవత్సర పంచాంగ ఫలితాలు వచ్చేశాయి. ఏపీ, అటు దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాల నేతల బలాబలాను, వారి అనుకూల, ప్రతికూల గ్రహాలను బట్టి చూస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ కన్నా మోదీ జాతక బలం బాగుండడంతో మోదీయే మరోసారి రాహుల్తో పోలిస్తే బెటర్ పెర్పామెన్స్ చేసి అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నట్టు పలువురు జ్యోతిష్యులు, పండితులు చెపుతున్నారు. కేంద్రం విషయంలో మాత్రం మెజార్టీ జ్యోతిష్యులు మోడీకే మళ్లీ జై కొడుతోన్న పరిస్థితి స్పస్టంగా కనిపిస్తోంది.
అటు కేంద్రంలో కావచ్చు.. ఇటు రాష్ట్రంలో కావచ్చు ఏర్పడే కొత్త ప్రభుత్వాలకు కుజ ప్రభావం వల్ల ఇబ్బందులు తప్పవనే తెలుస్తోంది. అయితే గురు బలం బాగుండడం మాత్రం కాస్త ఉపశమనం లభించవచ్చని అంటున్నారు. రాహుల్ గాంధీ విషయానికి వస్తే రాహు, కేతువులు తప్పుకున్నా గురు బలం బాగానే ఉండడంతో గతంతో పోలిస్తే కాస్త పుంజుకున్న వాతావరణం ఉంటుందనే చెపుతున్నారు.
పవన్ - లోకేష్ గెలుపు పక్కా...
రాజు కుజుడు - మంత్రి శని - సేనాధిపతుడు శుక్రుడు ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం..
ఈ సంవత్సరం రాజు కుజుడు కాగా.. మంత్రి స్థానంలో శని ఉండడంతో గత ఎన్నికల్లో ఓడిపోయిన వారందరికి ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు లభించబోతున్నాయట. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేష్ ఈ సారి మంగళగిరిలో మంచి మెజార్టీతో విజయం సాధించబోతున్నారట. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారనే ఆయన జాతకం రీత్యా ఎక్కువ మంది జ్యోతిష్యులు చెపుతున్నారు.
శుక్ర ప్రభావంతో స్త్రీ లీడర్ల హవా...
ఈ సారి సేనాపతి స్థానంలో శుక్రుడు ఉండడంతో రాజకీయాల్లో మహిళామణులు, మహిళా నేతల హవా ఎక్కువుగా ఉండబోతోంది. ఈ సారి రాహుల్ కన్నా తల్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ రాజకీయంగా ఉన్నతంగా వ్యవహరిస్తారని జాతకాలు చెపుతున్నాయి. మరి గుజరాత్ నుంచి ఫస్ట్ టైం రాజ్యసభకు వెళుతోన్న సోనియా గాంధీ హవా ఈ యేడాది ఉంటుందట. ఇక అమేధిలో ఈ సారి ప్రియాంక పోటీ చేస్తే గెలుస్తుందనే అంటున్నారు. అలాగే ఏపీలో జగన్ సోదరి షర్మిల తో పాటు అటు చంద్రబాబు భార్య భువనేశ్వరి ప్రభావం, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ప్రభావం కూడా గట్టిగానే ఉంటుందట.