వారు బీభత్సంగా రెచ్చిపోతుంటే ఆపలేక మౌన ప్రేక్షక పాత్ర పోషించారు. మొన్నటిదాకా టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తలెత్తిన ఘర్షణలను చూసాం. ఇప్పుడు వైసీపీలో కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మొదటి రౌండులో రిలీజ్ చేసిన లిస్టులో వచ్చిన మార్పుల కారణంగానే ఈ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు దీని పట్ల ఉత్పన్నమైన అసంతృప్తి అనేది ముగిసిపోయింది అనుకున్నారు చాలామంది. కానీ ఇప్పటికీ దాని గురించే గొడవలు జరుగుతుండటం గమనార్హం.
మరోవైపు ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన ఎడమ కంటే పై భాగం రాయి తగలడంతో అక్కడ వై ఆకారంలో చర్మం పగిలిపోయింది. ఆ దాడికి పాల్పడ్డ అగంతకుడు ఎవరో కనిపెట్టేందుకు పోలీసులు, మిగతా అధికారులు నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ఈ ఘటనలు, గొడవలు ఏపీలో చాలా ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకొక ఆయన సమయం మాత్రమే మిగిలి ఉంది అప్పటిదాకా పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఈసారి జగనే గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి కానీ ఏదైనా జరగవచ్చు. కాబట్టి అప్పుడే అంచనానికి రాకపోవడం మంచిది.ఈసారి ఈ సీఎం జగన్ గెలిస్తే చంద్రబాబు మళ్లీ జన్మలో సీఎం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారనేదే బిగ్ క్వశ్చన్.