ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు నామినేషన్లు సమర్పించడానికి తుది గడువు ఈ నెల 25. అదే రోజున వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పులివెందులలో తన నామినేషన్ సమర్పించనున్నారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అదే రోజు తమ నామినేషన్ వేయనున్నారు. పిఠాపురం నుంచి పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 25న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులందరికీ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో బీఫారాలను పవన్ కళ్యాణ్ అందించనున్నారు. పాలకొండ-నిమ్మక జయకృష్ణ, నెల్లిమర్ల- లోకం మాధవి, విశాఖపట్నం సౌత్- వంశీకృష్ణ యాదవ్, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, పెందుర్తి- పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, కాకినాడ రూరల్- పంతం నానాజీ, రాజానగరం- బత్తుల బలరామకృష్ణ, పి.గన్నవరం- గిడ్డి సత్యనారాయణ, రాజోలు- దేవ వరప్రసాద్, నిడదవోలు- కందుల దుర్గేష్, భీమవరం- పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం- బొమ్మిడి నాయకర్, పోలవరం- చిర్రి బాలరాజు, అవనిగడ్డ- మండలి బుద్ధప్రసాద్, తెనాలి- నాదెండ్ల మనోహర్, తిరుపతి- ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు- అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఎంపీలుగా పోటీ చేయనున్నారు. వీరంతా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ చేతులు మీదుగా బీఫారాలు తీసుకోనున్నారు.
ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు నామినేషన్లు సమర్పించడానికి తుది గడువు ఈ నెల 25. అదే రోజున వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పులివెందులలో తన నామినేషన్ సమర్పించనున్నారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అదే రోజు తమ నామినేషన్ వేయనున్నారు. పిఠాపురం నుంచి పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 25న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులందరికీ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో బీఫారాలను పవన్ కళ్యాణ్ అందించనున్నారు. పాలకొండ-నిమ్మక జయకృష్ణ, నెల్లిమర్ల- లోకం మాధవి, విశాఖపట్నం సౌత్- వంశీకృష్ణ యాదవ్, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, పెందుర్తి- పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, కాకినాడ రూరల్- పంతం నానాజీ, రాజానగరం- బత్తుల బలరామకృష్ణ, పి.గన్నవరం- గిడ్డి సత్యనారాయణ, రాజోలు- దేవ వరప్రసాద్, నిడదవోలు- కందుల దుర్గేష్, భీమవరం- పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం- బొమ్మిడి నాయకర్, పోలవరం- చిర్రి బాలరాజు, అవనిగడ్డ- మండలి బుద్ధప్రసాద్, తెనాలి- నాదెండ్ల మనోహర్, తిరుపతి- ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు- అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఎంపీలుగా పోటీ చేయనున్నారు. వీరంతా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ చేతులు మీదుగా బీఫారాలు తీసుకోనున్నారు.