వైసీపీ రెబల్ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. గత ఎన్నికల్లో రఘురామరాజు నరసాపురంలో వైసీపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో వైసీపీని విభేదించి రెబల్ ఎంపీగా మారారు.అయితే ఈసారి ఎన్నికల్లో వైసీపీ కి రాజీనామా చేసిన రఘురామ రాజు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తారని బాగా ప్రచారం జరిగింది. అయితే ఊహించని విధంగా రఘురామరాజుకు బీజేపీ నుంచి సీటు దక్కలేదు. దీంతో ఆయన పోటీ చేసే సీటుపై కొంతకాలం సస్పెన్స్ కొనసాగింది. అయితే చివరకు టీడీపీ నుంచి రఘురామ రాజు టికెట్ దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి స్థానంలో ఆయన పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మంతెన రామరాజును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆ నియోజకరవర్గంలో అసంతృప్త జ్వాలలు ఎగిసి పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ నియోజకవర్గంలో వర్గ విబేధాలు చోటు చేసుకున్నాయి.. 

అయితే శివరామరాజును చంద్రబాబు ఎదో విధంగా ఒప్పించారు. రామరాజుకే సీటు ఇస్తామని ఆయన ప్రకటించారు.చంద్రబాబు జోక్యంతో ఉండి నియోజకవర్గంలో టీడీపీ వర్గ విబేధాలు ముగిశాయి.అయితే నామినేషన్ల వేళ టీడీపీ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉండి నియోజకవర్గం అభ్యర్థి రామరాజును మార్చి అదే సీటును రఘురామకృష్ణంరాజుకు కేటాయించారు. దీంతో సోమవారం నామినేషన్ వేసేందుకు రఘురామరాజు సిద్ధమవుతున్నారు. బీఫామ్ తీసుకుని ఉండిలో తాను నామినేషన్ వేస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు.ముందు నుండి ప్రచారం చేస్తున్న రామరాజుకు మరింత ఉన్నత మైన స్థానం ఇస్తామని హామీ ఇవ్వడంతో రామరాజు ఒప్పుకున్నారు.ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, రామరాజు, తాను కలిసే ముందుకు వెళ్తామని రఘు రామరాజు చెప్పారు. తాను ఎంపీ స్థానాన్ని ఆశించానని కానీ ఎమ్మెల్యే అయినా కూడా పర్వాలేదని ఆయన తెలిపారు. ఎంతమంది వచ్చినా కూడా ఉండిలో తన గెలుపును ఆపలేరని రఘురామరాజు ధీమా వ్యక్తం చేశారు.రామరాజు, శివ రామరాజు మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: