![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/nara-lokesh970f638b-48d2-45b5-8c68-3f91cd94bbf2-415x250.jpg)
అమరావతిని రాజధానిగా కొనసాగించడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారన్నారు. అయితే ప్రజలందరి ఆశలను ఆయన వమ్ము చేశారన్నారు. యువతను, మహిళలను, రైతులను వైసీపీ నమ్మించి మోసం చేసిందన్నారు. ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నేతలను ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరిన మహిళలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని, వారిని హింసించారని గుర్తు చేశారు. ధైర్యంగా జగన్ పర్యటించలేకపోతున్నారని, పరదాలు కట్టుకుని సచివాలయానికి వెళ్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఇసుక, మట్టి, కంకర మొత్తం దోచుకున్నారన్నారు. పెద్ద దొంగను ఆదర్శంగా తీసుకుని, చిన్న దొంగలు ఇలా చేశారన్నారు. భూములిచ్చిన రైతులతో పాటు కౌలు రైతుల సమస్యలను తాము పరిష్కరిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తామని భరోసానిచ్చారు. పేదలకు పక్కా ఇళ్లను టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్మించి ఇస్తుందన్నారు.