![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/tdpc0bb0622-383e-4ca4-87f5-bc39521fb704-415x250.jpg)
కమలాపురం నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిను టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇక్కడి నుంచి వీర శివా రెడ్డి పోటీ చేయాలని భావించారు. టికెట్ తనకు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించారు. ఈ తరుణంలో ఆయన పార్టీ మారారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని 1994లో టీడీపీ నుంచే ఆయన ప్రారంభించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1999 ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మైసూరా రెడ్డి ఆయనపై గెలిచారు. ఇక 2004లో ఆయన టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసినా విజయం దక్కలేదు. అనంతర పరిణామాల్లో ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కమలాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఏపీ విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2019లో ఆయన వైసీపీలో చేరారు. అయితే అక్కడ ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో తనకు ప్రాధాన్యత దక్కలేదని భావించి టీడీపీలో చేరారు. తిరిగి ఆయన వైసీపీ గూటికి చేరారు.