కొల్లేరు ప్రాంతం అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలోని సగ భాగం అనే సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గాలు సైతం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. కొల్లేరు అంటే ఒకప్పుడు తియ్యటి నీటి చెరువుగా పేరు ఉండేది. ఇప్పుడు ఆ చెరువు ఉప్పుటేరుతో కలిసిపోయి ప్రస్తుతం అక్వా చెరువుల కింద మారిందనే సంగతి తెలిసిందే.
 
ఈ విధంగా జరగడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బ తింది. వందల, వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడివరకు వస్తున్న పక్షులు సైతం మరణిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తన ఆదేశాల అమలు కొరకు ఒక సాధికార కమిటీని సైతం వేయడం హాట్ టాపిక్ అయింది.
 
ఆ సాధికార కమిటీ వేసిన సమయంలో రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నారు. సుప్రీం కోర్టు తాజాగా కొల్లేరు ఒరిజినల్ సరిహద్దులను చెప్పాలని కోరింది. అయితే ప్రవాహిత ప్రాంతం కాకుండా ఏపీ సర్కార్ చెబితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ వివాదం విషయంలో ఏపీ సర్కార్ వ్యవహార శైలి ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
 
ఏపీ సర్కార్ సరిహద్దుల విషయంలో పొరపాట్లకు తావివ్వకుండా వ్యవహరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. కొల్లేరు సరస్సుకు పూర్వ వైభవం రావాలని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. చంద్రబాబు సర్కార్ త్వరలో మరికొన్ని కొత్త పథకాల అమలు దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. మే నెలలో సంక్షేమ పథకాల అమలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉండనున్నాయని భోగట్టా. బాబు సర్కార్ ఒకింత తెలివిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: