రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా రాజకీయాల గురించి సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా ప్రతి ప్రాంతంలో జనసేన పార్టీని ఆదరిస్తున్న ప్రజలనుద్దేశించి ఆళ్లగడ్డ సభలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా ప్రసంగించారు.

Image may contain: 2 people, people standing and outdoor

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….నీరు పెద్ద ఎత్తున వరదగా వస్తుంటే గోడ కట్టి ఆపగలరా?జనసేనను కూడా ఆపగలరా అని ఆయన అన్నారు. జగన్ మప్పై ఏళ్లపాటు ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారని, చంద్రబాబు తన కుమారుడు ముఖ్యమంత్రి అవ్వాలని అంటున్నారని, తాను మాత్రం మీరు బాగుండాలని కోరుతున్నానని ఆయన అన్నారు.

Image may contain: 2 people, crowd and outdoor

రాయలసీమలో మార్పు రావాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. మన దగ్గర కిరాయి మూకలు లేవని, ప్రైవేటు సైన్యం లేదని, కాని ప్రైవేటు సన్యాన్ని ఎదుర్కోగలిగే జనసేనికులు ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.

Image may contain: 4 people, crowd and outdoor

పవన్ కళ్యాణ్ రాజకీయం చేయలేరని కొందరు అంటుంటారని,వారికి సవాల్ చేస్తున్నానని, మీరు నిలబడతారా?నేను నిలబడతారా అన్నది చూస్తానని ఆయన అన్నారు. అన్నిటికి సిద్దపడే వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు.వర్గ,ప్యాక్షన్,కుటుంబ రాజకీయాలలో మార్పు తెస్తానని ,ఒకరోజులోనా, అంచెలంచెలుగా వస్తుందా అన్నది తెలియదు కాని, భవిష్యత్తు తెస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.ఒకటి రెండు కులాలకు కాకుండా అన్ని కులాలకు ప్రాతినిద్యం ఉండాలని ఆయన అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: