ఒకవైపు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎప్పుడు ఏపీకి వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తి వెళ్తున్నాడు. వెనుకటికి ఒకసారి బాబు గారు తనకు స్ఫూర్తి అని చెప్పి వెళ్లిన ఈ మంత్రిగారు ఇప్పుడు మరోసారి చంద్రబాబును ఆకాశానికెత్తేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ కేంద్రమంత్రి కి బాబు మీద ఇంత అభిమానం ఎందుకో కానీ.. ఈ అవకాశాన్ని తెలుగుదేశం వాళ్లు బాగానే ఉపయోగించుకొంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలపై కేంద్రమంత్రులు దృష్టిపెట్టారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. బాబు విదేశాలకు వెళ్లి భారీగా పెట్టుబడులు సాధించుకు వస్తున్నారని.. ఫలితంగా కేంద్రమంత్రులు అంతా బాబు ను చూసి మెచ్చుకొంటున్నారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కన్నా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటేనే కేంద్రమంత్రుల్లో ఎక్కువ క్రేజ్ ఉందని తెలుగుదేశం నేతలు మీడియాతో చెబుతున్నారు.వీళ్లే మరో అడుగు ముందుకేసి... మోడీ స్థానంలో చంద్రబాబు ఉంటే దేశానికి ఎంతో మేలు జరిగేదని కేంద్ర మంత్రులు అభిప్రాయపడుతున్నారని కూడా తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఈ విషయం మోడీ వరకూ వెళ్లిందని..అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాబుకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. మరి టీడీపీ నేతల మాటల్లో నిజానిజాలు ఏమిటో కానీ.. ఈ స్టోరీ వినడానికి అయితే ఆసక్తికరంగా ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: