
ఇక అదే సమయంలో ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లాంటివి ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఇక ఐసిసి ఇలా ప్రకటించినప్పుడు ఇక ప్రపంచ క్రికెట్లో మేటి ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారి పేర్లు ఇక ఈ టీంలో దర్శనమిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే 2022 ఏడాదికి సంబంధించి ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఐసీసీ ప్రకటించిన ఈ జట్టు వివరాలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.
ఇక ఆ వివరాలు చూసుకుంటే టెస్ట్ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్ల 11 మంది లిస్టులో అటు టీమిండియా నుంచి ఒకే ఒక ఆటగాడు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు టీమ్ ఇండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ అని చెప్పాలి. ఇక ఐసిసి ప్రకటించిన ఈ జట్టుకు ఇంగ్లాండు కెప్టెన్ బెన్ స్టోక్స్ ని సారధిగా ఎంపిక చేసింది అని చెప్పాలి. ఇకపోతే రోడ్డు ప్రమాదం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక అతను కొన్ని నెలలపాటు క్రికెట్కు దూరంగా ఉండబోతున్నాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక రిషబ్ పంత్ ను ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆప్ ది ఇయర్ జట్టులో చోటు దక్కడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.