యమునా నదిని దాటిన అనంతరం వాసుదేవుడు కన్నయ్యను గోకులంలోని నందుడి ఇంటికి చేరాడు. అప్పటికే నందుడి భార్య యశోధ ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో వాసుదేవుడు కృష్ణుడిని యశోద పక్కన ఉంచి చిన్ని పాపను తన వెంట తీసుకెళ్లాడు. ఈ విషయం నందుడికి మినహా మిగిలిన వారెవరికి తెలియకపోవడం గమనార్హం. ఆ విధంగా కన్నయ్య దేవకి తనయుడి నుంచి యశోద సుతుడికి ప్రసిద్ధి గాంచాడు.