భారతదేశం అంటే విశ్వాసాలూ, ఆధ్యాత్మికతలూ కలసిన మణిపూస. ఈ దేశంలో ప్రతి కోణంలో ఓ అద్భుతం, ఓ మర్మం నిగూఢంగా తేలియాడుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలతో శాస్త్రవేత్తల మనసులకే కాక, మన నమ్మకాలకూ ఓ మర్మమైన ప్రశ్నను కలిగించే విష‌య‌లు ఎన్నో. అలాంటి మాయ, మర్మ, మహిమ మేళవించిన దేవస్థానంగా నిలుస్తోంది మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఉన్న గడియాఘాట్ వలీ మాతాజీ ఆలయం. ఈ ఆలయం గూరించి చెప్ప‌లంటే, ఇక్కడ నూనె లేకుండా... నెయ్యి లేకుండా... కేవలం నీటితో దీపాలు వెలుగుతాయి! ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ ఇది నిజం! కాళీసింధ్ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ప్రతి సాయంత్రం నదిలోంచి తెచ్చిన నీటితో దీపాలు వెలిగిస్తారు. దీపాలు ఉదయం స్వయంగా ఆరిపోతాయి. మర్నాడు సాయంత్రం మళ్లీ అదే నీటితో దీపం వెలుగుతుంది. దీపాల వెలుగులా భక్తుల కళ్లు మెరిస్తాయి. ఈ అద్భుతాన్ని అక్కడి పూజారులు మాతాజీ చింతామణిగా భావిస్తూ, దివ్యశక్తిగా పరిగణిస్తున్నారు.


ఈ నీరు ఎలా పని చేస్తోంది? ..  పూజారుల వాదన ప్రకారం, ఇది సాధారణ నీరు కాదు. ఇది కలిసింద్ నది నీటిలో ఉండే దివ్య గుణాల ఫలితంగా ఉండవచ్చునని వారు విశ్వసిస్తున్నారు. దీపాల్లోకి ఈ నీరు పోసిన తర్వాత కొన్ని క్షణాల్లో అది జిగట పదార్థంలా మారి వెలుగు వెలిగిస్తుంది. ఇది కేవలం ఆలయ ప్రాంగణంలోనే సాధ్యపడుతుందని చెబుతారు. అదే నీటిని మీరు బయటకి తీసుకెళ్లినా దీపం వెలగదట! ఈ అద్భుతాన్ని వివరిస్తూ శాస్త్రవేత్తలు, రసాయన పరిశోధకులు, రిపోర్టర్లు అనేకమంది ఈ ఆలయాన్ని సందర్శించారు. నీటిని పరీక్షించారు, దీపాలను పరిశీలించారు. కానీ ఇప్పటివరకు ఇది నీటి వల్లే వెలుగుతోందని శాస్త్రీయంగా రుజువు చేయలేకపోయారు. నీటిలో ఎటువంటి వెలిగించే రసాయనాలు లేవని తేల్చారు. కానీ దీపం వెలుగుతూనే ఉంది. ఇది శాస్త్రానికి ఓ ప్రశ్నార్థక చిహ్నంగా మిగిలింది.


ఈ అఖండ జ్యోతి రహస్యం ఏంటంటే... పూజారుల కథనం ప్రకారం, నదిలో ప్రవాహం ఉండేంతవరకూ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. వర్షాకాలంలో నది మట్టం పెరిగినపుడు ఆలయం నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో పూజలు, దీపాల వెలుగు విరమించబడతాయి. తర్వాత ఆలయం మళ్లీ వెలువడిన తర్వాత దీపాలు వెలుగుతాయి. ఇది వర్షాకాలం నుంచి  వర్షాకాలం వరకూ వెలిగే దీపం! భక్తుల విశ్వాసం – శాస్త్రానికి ఓ మౌన సవాల్ .. ఈ ఆలయం మానవ విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక. శాస్త్రీయ విశ్లేషణలు విఫలమైనా, ప్రజల నమ్మకం మాత్రం ఒక్క అంశంగా నిలిచిపోయింది. ఇలాంటి ఆలయాలు భారతదేశం మర్మాల పరంపరను కొనసాగిస్తూ.. విజ్ఞాన శాస్త్రానికి ఓ కొత్త కోణాన్ని అందిస్తున్నాయి. మతం, శాస్త్రం మధ్య నడిచే ఈ సున్నితమైన మార్గంలో.. గడియాఘాట్ మాతాజీ ఆలయం ఒక దీపం వలె వెలుగుతోంది. మూసగా మారిన నమ్మకాల్లో ఇది ఓ విశ్వాసపు రైజింగ్ సన్. నీటితో వెలిగే దీపం… నిశ్చయంగా మన దేశం అద్భుతాలకు నిలయమని మరలా నిరూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: