ఈ క్రమంలోనే ధోనీ కెప్టెన్సీపై ధోని ఆటతీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో పూర్తిగా విఫలమైంది. కేవలం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ సీజన్ లో అతి తక్కువ స్కోరు ఇదే అని చెప్పాలి. ఇక ఆ తర్వాత బౌలింగ్ విభాగంలో అయినా స్కోరును కాపాడుకుంటుంది అంటే అది కూడా జరగలేదు.
మొదట చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినట్లు అనిపించినప్పటికీ ఆ తరువాత మాత్రం భారీ పరుగులను ఇచ్చేశారు. అయితే ఈ మ్యాచ్లో ధోని ఎలాంటి మైండ్ గేమ్ ఆడలేదు. ఇద్దరు కుడిచేతి వాటం బ్యాట్స్మన్లు కుదురుకుంటున్న వేళ ఎడమచేతి వాటం పేసర్ అయినా సామ్ కరణ్ తో బౌలింగ్ చేయించి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు భావించారు. ధోని కూడా అదే చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా సామ్ కరణ్ తో బౌలింగ్ చేయించలేదు ధోని. అతన్ని బాగా వాడుకొని ఉంటే ఎంతో ప్రయోజనం చేకూరేది అని అటు అభిమానులు విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.