ప్రస్తుతం యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా అక్కడ వన్డే టి20 సిరీస్ లో ఆడుతుంది. అయితే ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే మొదటి వన్డే మ్యాచ్లో ఎంతో అద్భుతంగా రాణించింది టీమిండియా జట్టు.  శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు అన్ని విభాగాల్లో కూడా అదరగొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఏడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును సొంతగడ్డపైనే ఓడించింది భారత జట్టు.



 అయితే ఇక ఇటీవలే రెండో మ్యాచ్లో కూడా టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 170 పరుగులు చేయకుండానే ఏడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. దీంతో ఇక టీమిండియా ఓటమి లాంఛనమే అనుకున్నారు అందరు. కానీ ఊహించని విధంగా బౌలర్ దీపక్ చాహర్ అద్భుతంగా రాణించాడు. ఇక ఆఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇక దానికి తోడు భువనేశ్వర్ కుమార్ నుంచి కూడా మంచి తోడ్పాటు అందడంతో చివరికి ఇక టీం ఇండియా రెండో వన్డే మ్యాచ్ కూడా గెలిచింది. ఒక వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.


 అయితే మ్యాచ్ ఓటమి తర్వాత శ్రీలంక జట్టు హెడ్ కోచ్ మికీ ఆర్థర్ కెప్టెన్ షనకల మధ్య మాటల యుద్ధం జరగడం వైరల్ గా మారింది. టీమ్ ఇండియా ఓటమి దిశగా సాగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఎంతో సంతోషంగా కనిపించాడు ఆర్డర్.  కానీ ఆ తర్వాత దీపాక్ చాహర్ నిలదొక్కుకోవడం జట్టుకు విజయం సాధించడంతో  సహనం కోల్పోయాడు  ఈక్రమంలోనే డ్రెస్సింగ్ రూమ్లో కోపంతో విచిత్రమైన హావభావాలు కనిపించాయి. ఇక  లంక ఓటమి దాదాపు ఖరారైపోయింది అన్నప్పుడు  మ్యాచ్ మధ్యలో మైదానంలో వచ్చి కెప్టెన్ షనక తో ఏదో మాట్లాడాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఓటమి కి సంబంధించి గట్టిగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు కూడా మాటలు యుద్ధం చేసుకున్నట్లు ప్రస్తుతం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది  .

మరింత సమాచారం తెలుసుకోండి: