ఇటీవలె భారత్ కు రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చాను పోటీలో పాల్గొంటున్న సమయంలో కడుపు నొప్పితో బాధ పడింది. అయినప్పటికీ లెక్కచేయకుండా ఎంతో అద్భుతంగా బరువులు లేపి ఇక రజత పతకాన్ని సాధించి భారత ప్రజల గౌరవాన్ని నిలబెట్టింది. ఇక ఇప్పుడు మరో అథ్లెట్ కూడా ఇలా ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సిల్వర్ మెడల్ సాధించుకుంది అన్న విషయం ఇటీవల తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ నెంబర్వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కొనసాగుతుంది తైవాన్ కి చెందిన తైజు యింగ్ . ఇక ఇటీవలే ఒలంపిక్స్ లో భాగంగా సెమీఫైనల్స్ లో తెలుగు తేజం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తైవాన్ చెందిన తైజు యింగ్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
ఇక ఈ పోరులో తైజు యింగ్ ఫై చేయి సాధించగా పి.వి.సింధు ఓటమి పాలైంది. ఇక ఆ తర్వాత జరిగిన పోటీలలో ఇక గెలిచిన తైజు యింగ్ సిల్వర్ మెడల్ సాధించింది. ఇక ఇటీవలే పీవీ సింధు తనతో చెప్పిన మాటలు గురించి ప్రస్తావించింది. తాను మెడల్ తీసుకుంటున్న సమయంలో పీవీ సింధు తనతో చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పించాయి అంటూ తైజు యింగ్ తెలిపింది. అందరం పథకాలు తీసుకుంటున్న సమయంలో.. ఇక కాంస్య పతకాన్ని అందుకున్న పీవీ సింధు నన్ను కలిసి మాట్లాడింది. నువ్వు అనారోగ్యంతో బాధ పడుతున్నావ్ అని తెలుసు.. అయినా బాగా ఆడావు... ఈరోజు నీది కాదు అంటూ పి.వి.సింధు చెప్పడంతో ఇక వెంటనే కన్నీళ్లు ఆగలేదు అంటూ తైజు యింగ్ తెలిపింది. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సిల్వర్ మెడల్ సాధించిన తైజు యింగ్ ఫై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి