ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠభరితమైన మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. పాకిస్తాన్ భారత్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం ప్రస్తుతం అందరూ వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఎలా జరగబోతుంది అనే దానిపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే దాదాపు ఇరవై ఎనిమిది నెలల విరామం తర్వాత  దాయాదులు గా ఉన్న ఈ రెండు జట్లు ఒక మ్యాచ్లో తలపడనున్నాయి అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో ఈసారిఅయిన పాకిస్తాన్ సత్తా చాటుతూ ఉందా లేదా అన్నదానిపై ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.



 ఇకపోతే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు అటు భారత్కు చెందిన నెటిజన్లు అందరూ సోషల్ ట్రోల్స్, మీమ్స్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారూ.   ఇక సోషల్ మీడియాలో ఇలాంటివి ట్రోల్స్ తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. సామాన్యులు ఇలాంటి ట్రోల్స్ పెట్టడం కామన్. కానీ ఇక భారత్లో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థగా ఉన్న జొమాటో ఏకంగా పాకిస్తాన్ ను ట్రోల్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టడం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ పెట్టింది. ఈరోజు (అక్టోబర్ 23 ) రాత్రి బర్గర్ పిజ్జా కావాలంటే మాకు చెప్పండి ఒక్క మెసేజ్ చేస్తే చాలు అవి మీకు అందుతాయి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కి అటు పాకిస్థాన్ క్రికెట్ అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా ట్యాగ్ చేయడం
 గమనార్హం.



 అయితే 2019 పంచ కప్  సమయంలో జరిగిన ఘటనను ఉద్దేశిస్తూ జోమాటో ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత ఇక ఆ దేశానికి చెందిన ఒక అభిమాని మారో ముజే మారో అంటూ కామెంట్ చేసిన వీడియో వైరల్ గా మారిపోయింది. అంతే కాదు ఏ లోగ్ కల్ రాత్ ఐస్క్రీమ్ కారహా  హై పిజ్జా బర్గర్ ఖాతే అంటూ తన బాధను వ్యక్తపరిచాడు  పాకిస్తాన్ క్రికెటర్ లలో ఒక్కరికి కూడా ఫిట్ నెస్ లేదని అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. సదరు అభిమాని చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇక ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక ఇప్పుడు మీకు పిజ్జా కావాలంటే చెప్పండి అంటూ ట్రోల్ చేయటం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: